Sarkar Live

Day: December 11, 2024

Sankranti Special Trains : సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
State

Sankranti Special Trains : సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

Sankranti Special Trains : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ స‌మ‌యంలో రైళ్లలో రద్దీ విప‌రీతంగా ఉంటుంది. ఈ రద్దీని తగ్గించేందుకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సంక్రాంతి ప్రయాణ ఇబ్బందులు తీర‌నున్నాయి. ఆ ప్ర‌త్యేక‌ రైళ్ల వివరాలు ఇవీ.. సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి పండుగ‌ సందర్భంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. 07097, 07098 నంబర్లతో ఈ ట్రైన్ ప్రతీ ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఇది సికింద్రాబాద్ స్టేష‌న్‌ లో బయలుదేరుతుంది. వైజాగ్‌ నుండి సోమ వారాల్లో సాయంత్రం 7.50 గంటలకు స్టార్ట్ అయి త‌రువాత‌ రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ...
No Confidence motion | అవిశ్వాసం నెగ్గేనా.. ఇండియా కూటమికి పెను స‌వాళ్లు!
State

No Confidence motion | అవిశ్వాసం నెగ్గేనా.. ఇండియా కూటమికి పెను స‌వాళ్లు!

No Confidence motion : రాజ్య‌స‌భ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానికి ఇండియా (INDIA) కూట‌మి సిద్ధ‌మైంది. స‌భ‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌డం లేద‌ని విప‌క్షాల‌పై జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప‌లుమార్లు మందలించ‌డంతో ఆయ‌న‌పై ఇండియా కూట‌మి ఎంపీలు గుర్రుగా ఉన్నారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హరించాల్సిన ఆయ‌న వైఖ‌రి అధికార ప‌క్షానికి అనుకూలంగా ఉందని, విప‌క్షాల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నార‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. స‌భ‌లో తమను మాట్లాడ‌నివ్వ‌కుండా చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ అడ్డుకుంటున్నార‌ని ఇండియా కూట‌మి ఎంపీలు విమ‌ర్శిస్తున్నారు. నోటీసు ఇచ్చిన ఇండియా కూట‌మి చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఇండియా కూట‌మి నోటీసు ఇచ్చింది. అయితే అవిశ్వాసానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం. 71 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానికి మ‌ద్ద‌తుగా సంతకాలు చేశార‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇ...
నేతన్నలకు స‌ర్కారు గుడ్ న్యూస్ త్వరలోనే చేనేత రుణమాఫీ
State

నేతన్నలకు స‌ర్కారు గుడ్ న్యూస్ త్వరలోనే చేనేత రుణమాఫీ

Hyderabad | తెలంగాణలోని నేతన్నలకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో చేనేత రంగం (Handlooms ) సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar Rao) ప్ర‌క‌టించారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీ అమ‌లుచేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ చేస్తామన్నారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వశాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాల‌ని మంత్రి సూచించారు. ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేనేత, జౌళి శాఖకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. దీంతో ఆ భారం మా ప్రభుత్వంపై...
error: Content is protected !!