Sarkar Live

Day: December 14, 2024

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..
Trending

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ రోగులు ఉన్నారు. ఈ విష‌యం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డియింది. అసంక్రమిత‌ వ్యాధుల (NCD) పోర్టల్‌ ప్రకారం 2024 నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్క‌ల‌ను అందులో ప్ర‌స్తావించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, డ‌యాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయ‌గా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డ‌యాబెటి...
TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు
State

TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు

Group 2 Exams | తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ‌పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదల కాగా, పలు కారణాలతో పరీక్ష వాయిదా పడుతూ వ‌చ్చింది. ఎట్టకేలకు ఈనెల 15, 16వ‌ తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌లు ఇవీ.. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు త‌మ తాజా పాస్‌పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట‌ తీసుకురావాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతి ఉంది .ఇతర ఆభరణాలు ఉంటే లోనికి అనుమ‌ అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ చెప్పులు మాత్ర‌మే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట...
Mohan Babu | దుష్ప్రచారం చేయ‌కండి.. మీడియాకు మోహ‌న్‌బాబు విజ్ఞ‌ప్తి
Cinema

Mohan Babu | దుష్ప్రచారం చేయ‌కండి.. మీడియాకు మోహ‌న్‌బాబు విజ్ఞ‌ప్తి

Mohan Babu : ఓ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తనపై దర్యాప్తు జరుగుతోందని వస్తున్న వార్త‌ల‌ను ఖండించిన మోహ‌న్‌బాబు తాజాగా మ‌రోసారి త‌న X ఖాతాలో మ‌రో ట్వీట్ చేశారు. హై కోర్టు తన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయలేదని స్ప‌ష్టం చేశారు. తాను ఎక్క‌డికీ వెళ్ల‌లేద‌ని, తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని తెలిపారు. త‌న‌పై లేనిపోని దుష్ప్ర‌చార జ‌రుగుతోంద‌ని, ద‌య‌జేసి మీడియా దీన్ని మానుకోవాల‌ని కోరారు. తీవ్రంగా స్పందించిన మోహన్ బాబు తన ఇంటి వ‌ద్ద జ‌రిగిన వివాదాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చిన జ‌ర్న‌లిస్టుపై మోహ‌న్‌బాబు (Manchu Mohan babu) దాడి చేశార‌ని ఆయ‌పై పోలీసు కేసు న‌మోదైంది. త‌న కుమారుడు మంచు మ‌నోజ్‌, ఆయ‌న భార్య‌తో మోహ‌న్‌బాబుకు వివాదం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయన ఇంటి వ‌ద్ద గొడ‌వ జ‌ర‌గ్గా దాన్ని క‌వ‌ర్ చేయ‌డాని మీడియా అక్క‌డికి వెళ్లింది. మీడియాతో మాట్లాడుతున్న క్ర‌మంలోనే మోహ‌న్‌బాబు కోపోద్రిక్త...
LK Advani | ఐసీయూలో అధ్వానీ.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన దిగ్గ‌జ నేత‌
National

LK Advani | ఐసీయూలో అధ్వానీ.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన దిగ్గ‌జ నేత‌

LK Advani : మాజీ ఉప ప్రధాని, బీజేపీ విశ్రాంత దిగ్గ‌జ నేత ఎల్.కె. అద్వానీ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఢిల్లీలోని అపోలో ఆస్ప‌త్రి (Apollo Hospital) ఐసీయూలో ఆయ‌న శ‌నివారం చేరారు. అద్వానీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. న్యూరాలజీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అయితే.. ఈసారి ఆస్ప‌త్రిలో చేరడానికి కార‌ణం ఇంకా వెల్లడికాలేదు. ఇదే ఆస్ప‌త్రిలో అద్వానీ చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది తొలిరోజుల్లో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. ఆత‌ర్వాత జూలైలో కూడా అద్వానీ ఇదే ఆస్ప‌త్రిలోని వైద్యుల ప‌ర్య‌వేక్షణ‌లో ఉన్నారు. అనంత‌రం డిశ్చార్జ్ అయ్యారు. అలాగే సాధారణ వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆగ‌స్టులో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. అప్పుడు కూడా ఆ హాస్పిట‌ల్ ప్ర‌త్యే...
Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి
State

Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti త‌న ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వ‌ల్లే సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కాస్త ఆల‌స్య‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌డ‌మే స‌రిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. ఖ‌మ్మంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఖ‌జానాను ఖాళీ చేశారు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విష‌యం వాస్తవమేన‌ని మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే నాటికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమీ మిగ‌ల్చ‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఖ‌జానాను ఆ ప్ర‌భుత్వం ఖాళీ చేసింద‌ని, పైగా అప్పులు మిగిల్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ అప్పులకు సంబంధించి వ‌డ్డీలు క‌ట్టేందుకే తెలంగాణ ఆర్థిక వ‌న‌రులు స‌రిపోవ‌డం లేదని ఆరోపించారు....
error: Content is protected !!