Sarkar Live

Day: December 20, 2024

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం
Crime

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో ...
Hyderabad Tourism |  హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం
State

Hyderabad Tourism | హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం

Hyderabad Tourism|  హైద‌రాబాద్‌లో మ‌రో ప‌ర్యాట‌క కేంద్రం ఆవిర్భ‌వించ‌నుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వస్థాప‌కుడు నంద‌మూరి తారక రామారావు 100 అడుగుల స్టాచ్యూ (NTR Statue) ఏర్పాటు కానుంది. మ‌హాన‌టుడుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల గుండెలో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) గౌర‌వార్థం ఆయ‌న భారీ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌నను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారు. విగ్రహం ఎక్క‌డంటే... ఎన్టీఆర్ సాహిత్య క‌మిటీ స‌భ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిశారు. ఆయ‌న కుమారుడు మోహ‌న‌కృష్ణ‌, క‌మిటీ అధ్య‌క్షుడు టి.డి.జ‌నార్ద‌న్‌, స‌భ్యుడు మ‌ధుసూద‌న‌రాజు సీఎంతో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే విష‌యంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. విగ్ర‌హం ఏ...
RTA Corruption | అస్సలు తగ్గేదేలే…
Special Stories

RTA Corruption | అస్సలు తగ్గేదేలే…

చుక్కలు వేయడం ఆగొద్దు.. మనల్ని ఆపేదెవరంటున్న అధికారులు బరితెగించిన ఎంవీఐ ల వెనుక ఉన్నదెవరో? రవాణా శాఖ లో కలకలం రేపిన లంచాల వివరాలు చర్చనీయాంశమైన "సర్కార్" కథనం.. RTA Corruption in Hanmakonda | ఆ అధికారులు బరితెగించారు.ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారి నుండి క్లర్క్ వరకు ఏ పనికి ఎంత లంచం తీసుకుంటున్నారో "ఆ కార్యాలయంలో కనకవర్షం" కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చినప్పటికి ఎలాంటి అదురు బెదురు లేకుండా దందాను కొనసాగిస్తున్నారు.రోజూ చుక్కల(లంచాల) రూపంలో లక్షల రూపాయల మామూళ్లు వస్తుండడంతో దందాను ఆపేందుకు అధికారులు ఇష్టపడడంలేదు."ఎవ్వరన్నా రానియ్ అస్సలు తగ్గేదేలే"అని పుష్ప-2 సినిమా రేంజులో అధికారులు డైలాగ్స్ కొడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోడ్(చుక్క)వేయడం ఆగొద్దూ... మనల్ని ఆపేదెవరంటూ ప్రైవేట్ అసిస్టెంట్ లకు అధికారులు హుకుం జారీచేశారని దాంతో ఎవరైనా వస్తే అధికారులే చూసుకుంటానన్నప్పుడు మనకేం...
error: Content is protected !!