Sarkar Live

Day: December 22, 2024

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్
Cinema, Viral

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్

Stone Pelting Outside Allu Arjun House | హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీతో పేరుతో కొంద‌రు దుండగులు దాడి చేశారు. కొంద‌రు వ్య‌క్తులు జూబ్లీహిల్స్ నివాసంపై రాళ్లు, టమోటాలు విసిరి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంటి లోపల ఉన్న పూల కుండీలు కూడా దెబ్బతినడంతో గందరగోళం నెలకొంది.రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బృందం నినాదాలు చేసింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో వారు వ్యక్తిగత సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సినిమా హాల్‌లో ప్రీమియర్ షోకి వచ్చిన సమయంలో తొక్కిసలాట కార‌ణంగా మరణించిన 35 ఏళ్ల మహిళ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నటుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేకపోవడం గమనార్హం....
Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌
Trending

Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌

Modi Kuwait Visit : కువైట్ సింగ‌ర్ ముబారక్ అల్ రాషీద్ (Mubarak Al Rashed) మ‌న దేశ‌భ‌క్తి గీతాన్ని ఆల‌పించారు. సారే జ‌హాన్ సే అచ్ఛా అంటూ ఆహూతుల‌ను ఆక‌ట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో రాషీద్ ఈ పాట‌ను పాడ‌టంతో కువైట్ వాసులు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ప్ర‌వాస భార‌తీయుల్లో భావోద్వేగం ఉప్పొంగింది. మ‌న‌దేశం గొప్ప‌దానాన్ని కువైట్ కొనియాడ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మోదీ గొప్ప‌గా మాట్లాడారు : రాషీద్ ముబారక్ అల్ రాషీద్ ANIతో మాట్లాడుతూ కువైట్‌, భారతదేశం మధ్య బలమైన సంబంధంపై గ‌ర్వ‌ప‌డుతున్నాను. నా దేశం కువైట్ గొప్ప‌ద‌నం గురించి భార‌త ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi) గొప్ప‌గా వ‌ర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధం గురించి ఆయ‌న బాగా మాట్లాడారు. ఆయన కువైట్ (Kuwait) ప్రజలకు భారతదేశాన్ని సందర్శించాలని కోర‌డం ఆనందాన్ని ఇచ్చిం...
One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్
National

One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొంద‌దు.. దిగ్విజ‌య్ హాట్ కామెంట్స్

One nation one Election : వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుపై కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్ (Digvijaya Singh) సంచ‌ల‌న కామెంట్ చేశారు. జేపీసీకి బిల్లులు పంపినా పార్ల‌మెంటులో మాత్రం ఆమోదం పొంద‌ద‌ని వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అగ‌ర్ మాల్వాలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ రెండూ ఆమోదం పొంద‌వు వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ (ONOE)తోపాటు రాజ్యాంగ సవరణ చేసే బిల్లు కూడా పార్ల‌మెంటులో దాఖ‌ల‌య్యాయి. వీటిపై లోక్‌సభలో హోరాహోరీ చర్చ జ‌రిగింది. ఈ రెండు బిల్లులను పార్లమెంటు (Parliament) సంయుక్త కమిటీ (JPC)కి పంపారు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజ‌య్ సింగ్ ఒక ప్ర‌శ్న‌న‌కు స‌మాధానంగా సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జేపీసీ ఏర్పాటు చేశారు గానీ.. ఆ బిల్లులు ఆమోదం పొందవు అన్నారు. బీజేపీ ఎంపీలే ఒకరిపై ఒక‌రు ప‌డ్డారు.. బీజేపీ ఫిర్యాదుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ల...
Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు
Crime

Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయుల‌కు గాయాలు

Car-ramming Attack : జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో కార్ ర్యామింగ్ దాడిలో ఐదుగురు మృతి చెందారు. 200 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఏడుగురు భార‌తీయులు ఉన్నారు. ఈ మేర‌కు నిన్న రాత్రి బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. శుక్రవారం సాయంత్రం సాక్సనీ-అనహాల్ట్ రాష్ట్రంలోని మాగ్డెబర్గ్ నగరం (Eastern German city of Magdeburg)లో 50 సంవత్సరాల వయసున్న‌ వ్యక్తి తన కారును క్రిస్మస్ మార్కెట్ (Christmas market)లో జనసందోహంపై నడిపాడు. దీంతో ఐదుగురు మృతి చెందార‌ని, వీరిలో తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడ‌ని, 200 మందికి పైగా గాయపడ్డారని జర్మన్ అధికారులు పేర్కొన్నారు. భార‌తీయుల‌కు సీరియ‌స్‌ కార్ ర్యామింగ్ దాడిలో ఏడుగురు భార‌తీయులు గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ కాగా మ‌రో న‌లుగురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఈ ఘటనను భ...
Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు
State

Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM Modi) నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 10.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌ను సంబోధిస్తారు. నియామ‌కాలు ఎక్క‌డెక్క‌డ అంటే.. Rozgar Mela అనే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా ఏక‌కాలంలో జ‌రుతుంది. 45 ప్రదేశాల్లో దీన్నివ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పీఎం మోదీ ప్రారంభిస్తారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ( Central government) లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జ‌రుగుతాయి. దేశ వ్యాప్తంగా ఎంపికైన నియ‌మితులైన వారు హోంమంత్రిత్వ శాఖ, పోస్ట‌ల్‌, ఉన్న...
error: Content is protected !!