Sarkar Live

Day: December 25, 2024

India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!
Sports

India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!

India vs Australia Boxing Day Test | బాక్సింగ్ డే సందర్భంగా గురువారం నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు (Ind vs Aus )లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఓపెనర్‌గా ఇప్పటివరకు సిరీస్‌లో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్‌ను మూడో ర్యాంక్‌కు మార్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాహుల్ మూడు మ్యాచ్‌లు, ఆరు ఇన్నింగ్స్‌లలో 47.00 సగటుతో 235 పరుగులతో, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత 84 పరుగులతో అత్యుత్తమ స్కోరుతో సిరీస్‌లో భారతదేశం త‌ర‌పున ఎక్కువ ప‌రుగులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌తో ప్రారంభమైన టెస్ట్ సీజన్‌లో, రోహిత్ కేవలం ఒక 50తో, ఆశ్చర్యకరంగా 11.69 సగటుతో ఏడు గేమ్‌లలో కేవ‌లం 152 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఈ సంవత్సరం, అతను 13 టెస్టులు, 24 ఇన్నింగ్స్‌లలో 26.39 స‌గ‌టుతో ...
Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..

Medak News | త‌మ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్‌ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెద‌క్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను ప‌ట్టించుకోలేద‌ని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధ‌వారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ మెదక్‌ ‌లో శాంతియుంతంగా దీక్ష‌లు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్‌ ‌తరలించడాన్ని,హ‌రీష్ రావు ఖండించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంటనే చాయ్‌ ‌తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు ప...
2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి
Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. Telecom Industry రెండింత‌ల వృద్ధి భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని...
Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం
Trending

Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం

Snowfall in Himachal Pradesh News హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు బీభ‌త్సం సృష్టించింది. క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్న వేళ ఈ అప‌శ్రుతి చోటుచేసుకుంది. సిమ్లా, మ‌నాలి (Shimla, Manali)తోపాటు ఇతర హిల్ స్టేషన్లలో భారీగా మంచు (Snowfall ) కుర‌వ‌డంతో సుమారు 223 ర‌హ‌దారులు మూసుకుపోయాయి. దీంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. గ‌త 24 గంట‌ల్లో అనేక వాహ‌నాలు ధ్వంస‌మయ్యాయి. న‌లుగురు మృతి చెందారు. అనేక మంది గాయప‌డ్డారు. మంచులో కూరుకుపోయిన వాహ‌నాలు క్రిస్మ‌స్ ( Christmas) సంబ‌రాల సంద‌ర్భంగా భారీ మంచు కుర‌వ‌డాన్ని ప‌ర్యాట‌కులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసి కేరింత‌లు కొట్టారు.. ఎంతో ఎంజాయ్‌ చేశారు. అయితే.. మ‌రో వైపు సిమ్లా, మ‌నాలిలోని అనేక‌ ప్ర‌దేశాల్లో ద‌ట్ట‌మైన మంచు అతి భారీ స్థాయిలో కురిసింది. దీంతో ఆ ప్రాంత‌మంతా తెల్ల‌గా మారిపోయింది. దీంతో 223 రహదారుల్లో సుమారు 500 వాహ‌నాలు ...
Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..
World

Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..

Donald Trump : మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఇంకా ప‌వ‌ర్‌లోకి రాక‌ముందే ఆయ‌న చేప‌ట్ట‌బోయే సంచ‌లన‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా వెల్ల‌డిస్తున్నారు. మా ఈ క్రమంలో దేశంలో మరణశిక్షల‌ను కఠిన నిర్ణయం అమ‌లు చేయ‌బోతున్నామ‌ని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్ల‌డించారు. తాను అధ్యక్షుడు అయ్యాక రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుకు ఆదేశాలిస్తానని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. బైడెన్ నిర్ణయంపై Donald Trump విమర్శలు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(Joe Biden) ఇటీవల ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40మంది ఖైదీల్లో 37మందికి జీవిత ఖైదుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణిశిక్ష తగ్గించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమ‌లుచేయాల‌ని న్యాయ శా...
error: Content is protected !!