Sarkar Live

Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM

Rozgar Mela 2025

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM Modi) నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 10.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌ను సంబోధిస్తారు.

నియామ‌కాలు ఎక్క‌డెక్క‌డ అంటే..

Rozgar Mela అనే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా ఏక‌కాలంలో జ‌రుతుంది. 45 ప్రదేశాల్లో దీన్నివ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పీఎం మోదీ ప్రారంభిస్తారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ( Central government) లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జ‌రుగుతాయి. దేశ వ్యాప్తంగా ఎంపికైన నియ‌మితులైన వారు హోంమంత్రిత్వ శాఖ, పోస్ట‌ల్‌, ఉన్నత విద్యాశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవలు త‌దిత‌ర విభాగాల్లో చేరతారు. రోజ్‌గార్ మేళా అనేది యువ‌త‌కు ఉద్యోగావ‌కాల‌ను సృష్టిస్తున్న‌ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఇది యువతను దేశ నిర్మాణం, సాధికారతలో భాగస్వామ్యం కావడానికి, స్వీయ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపింది.

అక్టోబ‌రులోనే Rozgar Melaకు శ్రీ‌కారం

అక్టోబరు 29న రోజ్‌గార్ మేళా (Rozgar Mela 2024) తొలి విడ‌త కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని న‌రేంద‌ర్ మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో నియామ‌కాల‌ను చేపట్టారు. 51,000 మందికి ప్ర‌ధాని మోదీ ఈ సంద‌ర్భంగా నియామ‌క ప‌త్రాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశ నిర్మాణంలో యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేయ‌డానికి రోజ్‌గార్ మేళా అనే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌ని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఉపాధి సృష్టిపై నేరుగా ప్రభావం చూపుతాయని అన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫైబర్ కేబుల్స్ వ‌ల్ల‌ కొత్త పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించామ‌న్నారు. అలాగే నీటిపారుద‌ల‌, వాయువు పైపులైన్‌లు ఏర్పాటు చేయడం, కొత్త పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను స్థాపించడం, మౌలిక సౌక‌ర్యాల వ్యయాలను తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు ప్రయోజనాలు కలుగుతోందని ప్ర‌ధాని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?