Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !
National

ముగిసిన రాజకీయ అనిశ్చితి: రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం !

Tamil Nadu Politics | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే (TVK) అధినేత విజయ్, శనివారం నాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరేల్కర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూడగట్టిన మెజారిటీ: 120కి చేరిన బలం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీ మార్కు 118. తొలుత 108 సీట్లతో మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మిత్రపక్షాల మద్దతు లభించడంతో బలం 120కి పెరిగింది: టీవీకే: 107 సీట్లు (విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయడంతో 108 నుంచి 107కి తగ్గింది). మద్దతు ఇస్తున్న పార్టీలు: కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2). వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు బేషరత...
ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
Hyderabad

ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి నిరాకరిస్తూ, వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ​ప్రధానాంశాలు.. ​కేసు నేపథ్యం: 2022-23 కాలంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా రూ. 3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ​మిల్లర్ల వాదన: ధాన్యం నాణ్యత సరిగా లేదని, ప్రభుత్వం మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల ఖర్చులు చెల్లించలేదని, అందుకే తాము బాధ్యులం కాదంటూ సుమారు 360 మంది మిల్లర్లు 58 పిటిషన్లు దాఖలు చేశారు. ​ప్రభుత్వ వాదన: మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకుని ఆ సొమ్మును సినిమా రంగం, ఇతర స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారని అడ్వకేట్ జనరల్ వాదించారు. ​కోర్టు వ్యాఖ్య...
కోట్లకు పడగలెత్తిన సర్వేయర్
Special Stories

కోట్లకు పడగలెత్తిన సర్వేయర్

​టెక్స్‌టైల్ పార్క్ కేంద్రంగా కోట్ల దందా.. ప్రభుత్వ సర్వేయర్ ‘గాలి’ వేగం! సదా.. ఆనందంగా అక్రమాల పర్వం రియల్టర్ అవతారమెత్తిన ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీ నజర్ వేస్తే విస్తుపోయే అక్రమాస్తులు వెలుగులోకి ​Warangal Textile Park Surveyor Scam | అతను ఒక ప్రభుత్వ సర్వేయర్. భూముల హద్దులు నిర్ణయించడమే అతని విధి. కానీ, ఆ హద్దులు దాటి అక్రమ సంపాదనలో ‘కోట్లకు పడగలెత్తాడు’. ప్రభుత్వ ఉద్యోగి ముసుగులో రియల్టర్ అవతారమెత్తి, సామాన్యుల భూములతో చెలగాటమాడుతూ అపర కుబేరుడిగా అవతరించాడు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ 'రియల్' సర్వేయర్ లీలలు హాట్ టాపిక్‌గా మారాయి. ​టెక్స్‌టైల్ పార్క్.. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్! ​మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును ఆసరాగా చేసుకున్న ఈ సర్వేయర్, అక్కడ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని 'గాలి'లా విస్తరించాడు. ప్రభుత్వ సమాచారం ముందే తెలుసుకుంటూ, అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ భూదంద...
​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
National

​బెంగాల్‌ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.సువేందు అధికారి పేరును బీజేపీ నేత భట్టాచార్య ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.పరిపాలనలో సమతుల్యత కోసం ఇద్దరికి డిప్యూటి సీఎం పదవులు దక్కనున్నాయి.అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన భేటీలో సువేందు అధికారిని బెంగాల్ సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంల నియామకంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది....
సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!
Special Stories

సివిల్ సప్లైలో ‘బంధు’ ప్రీతి: అర్హత లేకున్నా ఉద్యోగం.. ‘ఎర్రమంజిల్’ అండతోనే ఆ గత్తర!

Civil Supplies Nepotism Telangana | ​అర్హత ప్రాతిపదికన దక్కాల్సిన ఉద్యోగం అది.. కానీ అక్కడ ‘అర్హత’ కంటే ‘అండదండలకే’ పీట వేశారు. నిబంధనల ప్రకారం ఆ సీటులో కూర్చోవడానికి సదరు ఉద్యోగికి ఏమాత్రం అర్హత లేకపోయినా, చక్రం తిప్పిన ఓ ‘పెద్ద సారు’ పుణ్యమా అని దర్జాగా గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ​ఎర్రమంజిల్ నుంచే అసలు కథ! ​ఈ వ్యవహారానికి ప్రధాన కేంద్రం ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లై ప్రధాన కార్యాలయం. అక్కడ కీలక బాధ్యతల్లో ఉన్న ఒక ఉన్నతాధికారికి సదరు ఉద్యోగికి అత్యంత సన్నిహిత బంధువు కావడమే ఇందుకు కారణం. ఆ బంధుత్వమే ఇప్పుడు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేసింది. తను కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో చక్రం తిప్పేందుకు ఎర్రమంజిల్ నుంచే పావులు కదిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​నోరు మెదపని జిల్లా మేనేజర్ (DM) ​నిజానికి అర్హత లేని వ్యక్తి కీలక స్థ...
error: Content is protected !!