Sarkar Live

Day: January 9, 2025

Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..
National

Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్ర‌త్యేక రైలు..

Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్ర‌య‌ణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జ‌న‌వ‌రి 9 నాడే ప్రారంభించ‌డానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 110 సంవత్స‌రాల క్రితం 1915లో మహా...
Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?
State

Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?

Pushpa 2 Reloaded : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లుఅర్జున్ (Allu Arjun). ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప-2తో నటుడిగా మరొక మెట్టు ఎక్కారు. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన పుష్ప-2 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇంతకుముందు వచ్చిన పుష్ప-1 మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ మూవీ అంతకంటే రెట్టింపు హిట్ అయింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఓ లెవల్లో ఉండడంతో ఈసారి కూడా అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొదట డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీని ఒకటే పార్ట్ గా తీయాలనుకున్నారు. కానీ ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో స్టోరీ డిమాండ్ మేరకు రెండు పార్ట్ లుగా మారింది. దీంతో అల్లు అర్జున్ దాదాపు ఐదు సంవత్సరాలు తన సమయాన్ని ఈ మూవీకే కేటాయించాల్సి వచ్చింది. కాగా ఈ మూవీ బ...
Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే
Trending

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో (డిసెంబర్-జనవరి మధ్య) వ‌స్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశికు సమాంతరంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే.. ప్రతి నెలా చంద్రమాసంలో కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ వచ్చే ఏకాదశి తిథులు విశేషంగా భావించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అత్యంత పవిత్రమైన నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10 (శుక్రవారం) వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు భక్తులు విశేష పూజలు, ఉపవాసం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందుతారు. పౌరాణిక ప్రాముఖ్యత. రాసురుని కథ కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలు, సాధువులను హింసిస్తూ భయాందో...
ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు
State

ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు

భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఎదుట హాజ‌ర‌య్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయ‌న్ను ఏసీబీ ప్ర‌శ్నించ‌నుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసుల‌ను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్ర‌ధాన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఈ కేసులు న‌మోద‌య్యాయి. న్యాయవాది తోడుగా రాగా.. విచార‌ణ స‌మ‌యంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్ర‌శ్నించే స‌మ‌యంలో న్యాయవాది జోక్యం అవ‌స‌రం లేద‌ని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్ర‌మే అనుమతి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌ర‌ఫున ఏసీబీ కార్యాల‌యానికి ప్ర‌...
error: Content is protected !!