Sarkar Live

Day: January 16, 2025

Raja Goutham : ఆ మూవీ చేస్తే హీరో రేంజ్ వేరేలా ఉండేదేమో..
Cinema

Raja Goutham : ఆ మూవీ చేస్తే హీరో రేంజ్ వేరేలా ఉండేదేమో..

Raja Goutham : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర చంద్రబోస్ డైరెక్ట్ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం (Brahmanandam ) తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham). ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వారెవా, బసంతి లాంటి అరకోర సినిమాలు చేసిన కూడా నటుడిగా పేరు తెచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఈయన సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది. గత చిత్రం షార్ట్ ఫిలిమ్స్ తీసి గుర్తింపు పొందిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో మను అనే మూవీ చేశారు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత తన తండ్రి బ్రహ్మానందంతో కలిసి 'బ్రహ్మ ఆనందం' (Brahma Anandam) మూవీలో నటించారు. బ్రహ్మ ఆనందంతో.. ఒకప్పుడు బ్రహ్మానందం నటించని సినిమా అనేది లేదు. పెద్ద హీరోల సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ఆయన ఉ...
8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..
National

8th Pay Commission : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌..

8th Pay Commission Approval : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌న్ల‌కు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను పెంచేందుకు గాను 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం వెల్ల‌డించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూదిల్లీలో కేంద్ర మంత్రివర్గం స‌మావేశమై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకంది. కేబినెట్ స‌మావేశానికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. "1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటయ్యాయ‌ని, ఎలాంటి జాప్యానికి అవ‌కాశం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణ‌యించార‌ని కేంద్ర మంత్రి అశ్వ‌నీవైష్ణ‌వ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్త...
Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు
State

Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు

Krishna water Dispute Hearing : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (BRIJESH KUMAR TRIBUNAL) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. రాష్ట్ర‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని ట్రిబ్యూన‌ల్ వెల్ల‌డించింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరముంద‌ని ట్రైబ్యునల్ తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు రెండు రాష్ట్రాల వాదనలు వింటామని ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెల్ల‌డించింది. Krishna water Dispute Hearing : కాగా...
Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్
World

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూసివేత.. పుంజుకున్న స్టాక్ మార్కెట్

Hindenburg Research : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూత‌ప‌డింది. త‌మ కార్యకలాపాలను ఇక కొన‌సాగించ‌లేమ‌ని యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఇందులో ఎవ‌రి ఒత్తిడి లేదని, త‌మ ప్రాజెక్టుల ల‌క్ష్యాలు పూర్త‌యిన నేప‌థ్యంలో హిండెన్‌బ‌ర్గ్ రిసెర్చ్ సంస్థ‌ను మూసివేస్తున్నామ‌ని ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు నాథ‌న్ అండ‌ర్స‌న్ వెల్ల‌డించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్యంగా గౌత‌మ్ అదానీ గ్రూప్‌న‌కు చెందిన షేర్లు ఒక్క‌సారిగా భారీగా పెరుగుతున్నాయి. న‌ష్టం నుంచి లాభాల వైపు రెండేళ్ల క్రితం ఇదే నెలలో హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్లు న‌ష్ట‌పోయారు. తాజాగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూసివేత వార్త‌ల నేప‌థ్యంలో అదానీ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మూసివేయాలనే నిర్ణయం ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపై స్పష్టంగ...
Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..
State

Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..

Numaish 2025 : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూమాయిష్ (Numaish)లో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఓ వినూత్న హ‌బ్‌ను ఏర్పాటు చేశారు. టీ-హ‌బ్ (T-Hub) ఈసీవో సుజిత్ జాగిర్దార్ దీనిని ఈ రోజు ప్రారంభించారు. స్టార్టప్‌ల ద్వారా యువ పారిశ్రామికవేత్త‌లు రూపొందించిన ఉత్పత్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి, వాటిని విక్రయించడానికి ఈ హ‌బ్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని నుమాయిష్ నిర్వాహకులు అంటున్నారు. సేవా రంగంలో రూపాంత‌రం చెందిన‌ స్టార్ట‌ప్ (Startups)లపై ప్ర‌జ‌ల‌కు అగాహ‌న కల్పిస్తూ వాటిని అందుబాటులోకి తేవ‌డం కూడా దీని ముఖ్యోద్దేశ‌మ‌ని తెలిపారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా స్టార్టప్‌ల ప్రతిభను ప్రదర్శించి, ప్రజలకు చేరువకావ‌డానికి ఇది మంచి అవకాశమ‌ని అంటున్నారు. 30 స్టార్టప్‌లకు అవకాశం రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ, టీ-హబ్ స‌హ‌కారంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో నూమాయిష్ (Exhibition) న‌డ...
error: Content is protected !!