Sarkar Live

Day: January 26, 2025

Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌
Trending

Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌

Viral News | అప్పును రాబ‌ట్టేందుకు బ్యాంకు అధికారులు వింత‌గా ప్ర‌వర్తించారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క స‌భ్యురాలైన‌ ఓ గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిర‌స‌న పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మ‌హిళ‌ భ‌యాందోళ‌లకు గురైంది. బ్యాంక‌ర్ల వైఖ‌రిని చూసి గ్రామ‌స్థులు విస్తుబోయారు. అప్పు వ‌సూలు చేసే విధానం ఇదేనా? అని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అస‌లు చెల్లించడం భార‌మైంది ఆమెకు. ఈ క్ర‌మంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వ‌చ్చాయి. చ‌దువురాని ఆమె ఈ విషయాన్ని గ‌మనించ‌లేదు. స‌కాలంలో ఆమె డ‌బ్బులు క‌ట్ట‌లేక‌...
Accident | వ‌రంగ‌ల్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మ‌రణం
State

Accident | వ‌రంగ‌ల్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మ‌రణం

వ‌రంగ‌ల్ (Warangal)లో ఘోర ప్రమాదం (Road Accident) జ‌రిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల (iron bars) లోడు రెండు ఆటోల‌పై ప‌డ‌టంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి (instant death) చెందారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వ‌రంగ‌ల్‌-మామునూరు ర‌హ‌దారిపై ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఓవ‌ర్ లోడ్‌.. ఓవ‌ర్‌టేక్‌ రైల్వే ట్రాక్స్ (railway track)కు ఉప‌యోగించే ఇనుప రాడ్ల‌ను త‌ర‌లిస్తున్న లారీ భార‌త్ పెట్రోల్ బంక్ స‌మీపంలోకి రాగానే రెండు ఆటో రిక్షాల‌ను ఓవ‌ర్‌టేక్ చేయ‌డానికి ప్రయ‌త్నించింది. వేగంగా ముందుకు దూసుకెళ్లే క్ర‌మంలో అందులోని ఇనుప రాడ్లు క‌ద‌లి ఆ ఆటోల‌పై ప‌డ్డాయి. దీంతో ఏడుగురు దుర్మ‌ణం పాల‌య్యారు. మృతుల్లో న‌లుగురు మ‌హిళ‌లు, ఒక చిన్నారి ఉన్నారు. వీరి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. Warangal Accident : క్ష‌త‌గాత్రుల ప‌రిస్థితి విష‌మం ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఆరుగురిన...
Republic Day | దేశ వ్యాప్తంగా ఘ‌నంగా గణతంత్ర దినోత్సవం.. రెప‌రెప‌లాడిన త్రివ‌ర్ణ ప‌తాకం
National

Republic Day | దేశ వ్యాప్తంగా ఘ‌నంగా గణతంత్ర దినోత్సవం.. రెప‌రెప‌లాడిన త్రివ‌ర్ణ ప‌తాకం

గణతంత్ర దినోత్సవం (Republic Day) దేశ‌వ్యాప్తంగా ఈ రోజు ఘ‌నంగా జరిగింది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (kartavya path) వేదిక‌గా నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi)తోపాటు ఇత‌ర కేంద్ర మంత్రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) హాజరయ్యారు. సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రగతి, శక్తిసామ‌ర్థ్యాలు, సమానత్వం యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శ‌మ‌ని ఆమె అన్నారు. రాష్ట్రపతి ముర్ము, సుబియాంటో సంప్ర‌దాయ‌ బగ్గీలో వస్తూ ఈ పరేడ్‌లో పాల్గొనడం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. Republic Day : పరేడ్.. ప్రత్యేకతలు కర్తవ్య పథంలో జరిగిన పరేడ్ భారతదేశ వైభవాన్ని ప్ర‌తిబించింది. ఉదయం 10.30 వ...
EV | దేశంలో ఈవీల విప్ల‌వం.. వినియోగంలో భారీ వృద్ధి..
State

EV | దేశంలో ఈవీల విప్ల‌వం.. వినియోగంలో భారీ వృద్ధి..

Green Mobility | ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా భార‌త‌దేశంలో ఈ వెహికిల్స్ వాడ‌ట‌కం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2030 నాటికి వార్షిక వాహన అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండ‌బోతోంద‌ని ఓ స‌ర్వేలో తేలింది. 2024 నుంచి 2030 మధ్య కాలంలో భారతదేశం ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని SBI క్యాపిటల్ మార్కెట్స్ (SBICAPS) నివేదిక చెబుతోంది. అయితే.. అంతర్గత దహన ఇంజిన్ (Internal Combustion Engine) వాహనాల వినియోగం కూడా దీంతోపాటే కొన‌సాగుతుంద‌ని వైల్ల‌డైంది. EV లపై పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ EVల వినియోగం తొలుత చాలా త‌క్కువ‌గా ఉండేది. 2019లో ఒక శాతం కూడా లేదు. క్ర‌మేణా పెరుగుతూ 2024 నాటికి 7.4 శాతానికి పెరిగింది. ఎక్కువ ఫీచ‌ర్లు క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఈ వాహ‌నాలు వినియోగ‌దారుల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పైగా మెయింట‌నెన్స్ చాలా త‌క్కువ‌గానే ఉండ‌టంతో వీటిని...
wankidi | వాంకిడి లో నాయక్ సాబ్ హవా..?
Special Stories

wankidi | వాంకిడి లో నాయక్ సాబ్ హవా..?

వసూళ్లకు ప్రైవేట్ సైన్యం.. రోజు లక్షల్లో మామూళ్లు… చెక్ పోస్ట్ లో సారు రూల్స్ పాటించాల్సిందేనట.. వసూళ్లు చేపిస్తాడు..? వాటాలు పంచుతాడు..? అవినీతి నిరోధక శాఖను సైతం సారు మేనేజ్ చేస్తాడని చెక్ పోస్ట్ లో ప్రచారం..? Wankidi checkpost | అక్కడ నాయక్ సాబ్ చెప్పిందే వేదమట, ఆ చెక్ పోస్టులో ఆయన చేసిందే చట్టమని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రైవేట్ సైన్యాన్ని తయారుచేయడంతోపాటు, వసూళ్లకు పాల్పడడంలో " నాయక్ సాబ్" ఆరితేరాడని ఆర్టీఏ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ చెక్ పోస్టులో రవాణా శాఖ నిబంధనల కంటే నాయక్ భాయ్ నిభందనలే అమలవుతున్నాయంటే సదరు అధికారి హవా ఏస్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు.వివరాల్లోకెళితే కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఉన్న వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్టులో ప్రైవేట్ వ్యక్తులే మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ల వలే వాసహనదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది....
error: Content is protected !!