Sarkar Live

Day: February 17, 2025

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
National

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?

Strong earthquake In Delhi | దేశ‌ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్ర‌త నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డ‌య్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది. Strong earthquake : ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఈ భూకంపం తీవ్ర‌త ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...
TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!
Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!

TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వ‌ర్యంలో దాడులు చేశారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిసింది. 14 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ‌? ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించార‌ని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపార‌వేత్త‌లు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చార‌ని స‌మాచారం. డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత ...
Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..
Trending

Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..

New Delhi | దేశ రాజ‌ధాని న్యూఢిల్లీవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమం (Yamuna River Cleaning) అధికారికంగా ప్రారంభమైంది, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నదిని పునరుజ్జీవింపజేయడానికి నాలుగు దశల ప్రతిష్టాత్మక ప్లాన్ ను ప్ర‌క‌టించారు. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నదిలో చెత్తాచెదారాన్ని కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. నది నుంచి వ్యర్థాలను తొలగించడానికి చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలను తీసే యంత్రాలు, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్‌లను మోహరించామ‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. కాలువల్లోకి మురుగునీటిని విడుదల చేస్తున్న పరిశ్ర‌మ‌ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC)ని కూడా ఆదేశించారు. సోషల్ మీడియా సైట్ X లో, LG కార్యాలయం ఈ తాజా చొర‌వ‌ను పోస్ట్ చేసింది. య‌మునా న‌దిన...
error: Content is protected !!