Sarkar Live

Day: February 26, 2025

Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం
State

Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం

TG Govt to build Ratan Tata Road : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దివంగ‌త ర‌త‌న్ టాటా స్మార‌కార్థం తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) ఓ కొత్త ర‌హ‌దారిని నిర్మించ‌నుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైద‌రాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయ‌నుంది. ఈ కొత్త ర‌హ‌దారికి ర‌త‌న్‌టాటా రోడ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌నుంది. Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్య‌యం ర‌త‌న్ టాటా స్మార‌క గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ ర‌హ‌దారి నిర్మాణాన్ని చేప‌ట్ట‌నుంగా రెండు దశ‌ల్లో ప‌నులు సాగ‌నున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ....
Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌
Technology

Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌

india's first Semiconductor Chip : ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భార‌త‌దేశం అద్భుత వృద్ధిని సాధిస్తోంది. ప్ర‌స్తుతం రూ. 10 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్‌ను దాటింది. రూ. 5 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తులు చేస్తోంది. ఇప్ప‌టికే అనేక కొత్త ఆవిష్క‌రణ‌ల‌తో ముందుకు వెళ్తున్న భార‌త‌దేశం మ‌రో అడుగు ముందుకేసింది. స్వ‌దేశి సెమీ కండ‌క్ట‌ర్ చిప్ (india's first Semiconductor Chip) త‌యారీకి సిద్ధ‌మైంది. ఇది ఈ ఏడాది (2025)లోనే అందుబాటులోకి రానుంది. భోపాల్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. Semiconductor Chip : ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముంద‌డుగు భారతదేశ తొలి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ 2025లో పూర్తిగా సిద్ధంగా ఉండబోతోంద‌ని అశ్విని వైష్ణ‌వ్ తెలిపారు. ఇందుకు HLBS టెక్నాలజీ కంపెనీ ...
Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు
State

Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు

హైదరాబాద్‌: మహా శివరాత్రి (Maha Shivaratri) ప‌ర్వ‌దినం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బుధవారం ఉద‌యం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు త‌ర‌లిరావ‌డం మొద‌లైంది. శివుడికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో మారేడు ద‌ళాలు స‌మ‌ర్పించి అభిషేకాలు చేస్తున్నారు. ఆల‌యాల‌ ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మ‌హదేవుడి దర్శనం కోసం ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో శైవ‌క్షేత్రాలు మారుమోగుతున్నాయి. Vemulawada Rajanna Temple : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ‌ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్య‌లో తరలి వస్తున్నారు.‌ మహాశివరాత్రి సంద‌ర్భంగా రాజరాజేశ...
error: Content is protected !!