Sarkar Live

Day: March 7, 2025

KCR | లక్షలాది మందితో వ‌రంగ‌ల్‌లో భారీ బహిరంగ సభ.. ప్రకటించిన కేసీఆర్!
State

KCR | లక్షలాది మందితో వ‌రంగ‌ల్‌లో భారీ బహిరంగ సభ.. ప్రకటించిన కేసీఆర్!

Ex CM KCR Meeting in Erravalli : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసిఆర్ (K) శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఉద్య‌మాల గ‌డ్డ ఓరుగ‌ల్లు (Warangal)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. క‌నీవినీ ఎరుగుని స్థాయిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు వరంగల్ సమీపంలో విశాలమైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామ‌ని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్ర‌వారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. KCR : తెలంగాణ సమాజం కష్టాల్లో ఉంది.. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ (K.Chandra shekhar Rao) ప్ర‌సంగిస్తూ… తెలంగాణ సాధ‌న కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలు చేసి స్వ‌రాష్ట్రాన్ని ...
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు..
State

IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు..

IPS Transfers : తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక అడిష‌న‌ల్ డీజీ, ఇద్ద‌రు ఐజీపీలు, ఇద్ద‌రు డీఐజీలు ట్రాన్ ఫర్ అయ్యారు. అద‌న‌పు డీజీ (ప‌ర్స‌న‌ల్‌)గా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్ట‌ర్‌గా అనిల్ కుమార్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. IPS Transfers : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన వారి జాబితా సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామ‌గుండం సీపీగా అంబ‌ర్ కిశోర్ ఝా, వ‌రంగ‌ల్ సీపీగా స‌న్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశ‌ర్మ‌, మ‌హిళా భ‌ద్ర‌త విభాగం ఎస్పీగా చేత‌న‌, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్‌, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర‌, నిజామాబాద్ సీపీగా సాయిచైత‌న్య‌, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంక‌జ్, క‌రీంన‌గ‌ర్ ఎస్పీగా గౌస్ ఆలం...
KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు
career

KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు

KVS Admissions 2025 : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఒక‌టో తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (Kendriya Vidyalaya Sangathan (KVS) విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రవేశాల (Admissions)కు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. KVS Admissions 2025 : సీట్ల రిజర్వేషన్ వివరాలు కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్‌ పొందేందుకు కొన్ని రిజర్వేషన్‌ నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులకు 15% ఎస్టీ విద్యార్థులకు 7.5% ఓబీసీ విద్య...
IndiGo airline | ప్ర‌పంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన సంస్థ..
Business

IndiGo airline | ప్ర‌పంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన సంస్థ..

IndiGo airline : ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రపంచంలో రెండో (world’s second) వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా గుర్తింపును తెచ్చుకుంది. 2024లో సీటు సామర్థ్యం (seat capacity)లో 10.1 శాతం వృద్ధిని సాధించింది. 134.9 మిలియన్ సీట్ల స్థాయికి చేరుకొని ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) త‌ర్వాతి స్థానాన్ని సంపాదించుకుంది. గత సంవత్సరంతో పోల్చితే 10.4 శాతం వృద్ధిని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సాధించిందని అఫిషియ‌ల్ ఎయిర్‌లైన్ గైడ్ (Official Airline Guide (OAG) నివేదిక వెల్ల‌డించింది. IndiGo airline : ఫ్రీక్వెన్సీ వృద్ధిలో అగ్రస్థానం ఇండిగో సంస్థ 2024లో విమానాల ఫ్రీక్వెన్సీ వృద్ధిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 9.7 శాతం వృద్ధితో 749,156 విమానాల ఫ్రీక్వెన్సీ నమోదు చేసింది. ఇది సంస్థ విస్తృత సేవలను సూచిస్తుంది. ఇండిగో ప్రస్తుతం 405 విమానాల నౌకాదళాన్ని కలిగి ఉంది. ఇందులో ఎయిర్‌బస్ A320-200, A320న...
Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?
Cinema

Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ ని (Puri Jagannadh)మించిన డైరెక్టర్ ఇంకొకరు లేరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇడియట్, దేశముదురు, చిరుత,పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోను ఓ రేంజ్ లో చూపెడుతూ ఆడియన్స్ ఈలలు కొట్టేలా డైలాగులు రాసి హిట్లు కొట్టాడు. అయితే కొంతకాలంగా పూరీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ తో (NTR)చేసిన టెంపర్ మూవీ తర్వాత చాలా కాలం పాటు పూరీకి హిట్టు లేదు. ఫ్లాప్ ల్లో ఉన్న పూరీకి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి జోష్ ను ఇచ్చింది.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ , రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీస్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఈ మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా కావడంతో భారీగా నష్టపోయాడు. కానీ స్టార్ లతో సినిమాలను మాత్రం లైన్లో పెడుతూనే ఉన్నాడు. Puri Jagannadh Movie : పూరీ గోపిచంద్ కాంబో..? ప్రజెంట్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తో తన నెక్స్ట్ సినిమా తీస్తున్నాడని ...
error: Content is protected !!