Sarkar Live

Day: March 12, 2025

Urea Shortage : తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళనలో అన్నదాతలు
State

Urea Shortage : తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత, ఆందోళనలో అన్నదాతలు

Telangana news : యూరియా సరఫరా తగినంతగా ఉందని రాష్ట్ర అధికారులు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాల్లోని యూరియా కొరత (Urea Shortage)తో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎరువుల నిల్వలను తీసుకుంటున్నట్లు అధికారులు ఒకవైపు చెబుతున్నప్పటికీ, రైతులు మండుతున్న ఎండల్లో గంటలపాటు వేచిచూడాల్సి దుస్థితి ఎదురవుతోంది. క్యూలైన్లలో నిలుచున్నా కూడా చాలా మందికి యూరియా అందలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితుల స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వెలుపల క్యూలో నిలబడుతున్నారు. కొందరు ఎండలను తాళలేక తమ చెప్పులు, సంచులను లైన్‌లో ఉంచి, తమకు కేటాయించిన యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రైతులకు తమ వాటా లభించినప్పటికీ, చాలా మంది రైతులు ఉత్త చ...
OU students protest | ఓయూ హాస్ట‌ల్ భోజ‌నంలో బ్లేడ్‌..
State

OU students protest | ఓయూ హాస్ట‌ల్ భోజ‌నంలో బ్లేడ్‌..

OU students protest : ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) గోదావరి హాస్టల్ భోజ‌నంలో బ్లేడ్ ఉండ‌టం (found a blade in meals) తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీనిపై విద్యార్థులు రోడ్డెక్కారు. అధికారుల నిర్ల‌క్ష్యంపై మండిపడ్డారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు రోజురోజుకూ చోటుచేసుకుంటున్నా ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. OU students protest : అధికారుల తీరుపై మండిపాటు గతంలో కూడా భోజనంలో ఇలాగే పురుగులు, బ్లేడ్లు క‌నిపించాయ‌ని, అధికారులకు ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విద్యార్థులు (students) విమ‌ర్శించారు. ఇన్ని సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నా స్పందించ‌క‌పోవడంలో ఆంత‌ర్య‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ నిర్లక్ష్యానికి వైస్ చాన్స‌ల‌ర్ (Vice-Chancellor), చీఫ్ వార్డెన్ (Chief Warden), ఇత‌ర అధికారులు బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. క‌నీసం తిండి కూడా స‌రిగా పెట్ట‌రా? ...
TG budget session | ర‌సాభాసాగా అసెంబ్లీ స‌మావేశం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ గ‌రం గ‌రం
State

TG budget session | ర‌సాభాసాగా అసెంబ్లీ స‌మావేశం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ గ‌రం గ‌రం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (TG budget session) ర‌సాభాసాగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉభయ స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌సంగిస్తుండ‌గా బీఆర్ఎస్ స‌భ్యులు ( BRS legislators) ప‌లుమార్లు అంత‌రాయాలు క‌లిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పంట రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలను త‌న గవర్నర్ ప్ర‌సంగం (Governor Jishnu Dev Verma’s speech)లో ప్రశంసించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ ప‌థ‌కాలు పూర్తిగా అమ‌లు కాలేద‌ని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, అలాగే రైతులకు రూ.500 బోనస్ అందించిందని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన‌డంతో బీఆర్ఎస్ శాస‌న స‌భ్యులు తీవ్రంగా ఆరోపించారు. ఈ ప‌థ‌కాలు గతంలో ముఖ్యమంత్రి కెసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని మండిప‌డ్డారు. ప్రాజెక్టుల నీటి మ‌ళ్లింపుపై నిర‌స‌న‌ తెలంగాణ రాష్ట్ర జల హక్కులను ...
VCIWU | ప్రీమియర్ విద్యాసంస్థగా కోఠి మ‌హిళా వ‌ర్సిటీ..
State

VCIWU | ప్రీమియర్ విద్యాసంస్థగా కోఠి మ‌హిళా వ‌ర్సిటీ..

VCIWU | తెలంగాణ‌లో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో విద్యావ‌కాశాల‌ను మెరుగుప‌ర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ( Telangana government( మ‌రో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి (Koti)లో ఉన్న వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి (VCIWU) భారీగా నిధులను కేటాయించింది. వీటితో కొత్త భవనాలను నిర్మించ‌డంతోపాటు ప్రాచీన భవనాలను పునరుద్ధరించనున్నారు. త‌ద్వారా ఉత్త‌మ వ‌స‌తుల‌తో విద్యా ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చ‌నున్నారు. VCIWU : అభివృద్ధి ప్రణాళిక వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ( Veeranari Chakali Ilamma Women’s University (VCIWU) కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.540 కోట్లు కేటాయించింది. రూ.15.5 కోట్ల‌తో ప్రాచీన నిర్మాణాలను పున‌రుద్ధ‌రించ‌నుంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేసింది. ఈ విశ్వవిద్యాలయానికి తగినంత సౌకర్యాలు అందించేందుకు కొత్త...
Rajiv Yuva Vikasam | యువత కోసం కొత్త పథకం.. అర్హతలు ఏమిటి ?.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే..
Career

Rajiv Yuva Vikasam | యువత కోసం కొత్త పథకం.. అర్హతలు ఏమిటి ?.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే..

Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిరుద్యోగ యువతకు శుభ‌వార్త చెప్పింది. వీరి కోసం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి (self-employment) అవకాశాలు పొందొచ్చు. ఇందుకు ప్ర‌భుత్వం రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ల‌బ్ధి చేకూర‌నుంది. అర్హత పొందిన ప్రతి అభ్య‌ర్థికీ రూ.3 లక్షల ఆర్థిక సహాయం అంద‌నుంది. సొంత ప‌రిశ్ర‌మ‌ను స్థాపించుకొనేలా.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు క‌ల్పించ‌డ‌మే రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) ప‌థ‌కం ముఖ్యోద్దేశం. లబ్ధిదారులు స్వయం ఉపాధి ద్వారా తమ జీవితాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ పథకాన్ని లబ్ధిదారులు తమ సొంత‌ వ్యాపారం లేదా చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడా...
error: Content is protected !!