Sarkar Live

Day: March 21, 2025

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?
National

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు. Revanth Reddy : కీల‌కాంశంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీల‌క‌ రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వి...
Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌
World

Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌

Death sentence : విదేశాల్లో ఉన్న భార‌తీయుల్లో 49 మంది భారతీయులు మ‌ర‌ణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) స‌హా మొత్తం ఎనిమిది దేశాల్లో మ‌న భార‌తీయులు మ‌ర‌ణ శిక్ష‌ను ఎదుర్కొంటున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Indian government) వెల్ల‌డించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నార‌ని తెలిపింది. వీరిలో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు విచార‌ణలో ఉన్నవారు కూడా ఉన్నార‌ని వెల్ల‌డించింది. Death sentence : యుఏఈలోనే ఎక్కువ‌ భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్క‌డ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్ర...
Sensex, Nifty rebound | లాభాల దిశగా స్టాక్ మార్కెట్.. బిగ్ అప్‌డేట్‌
Business

Sensex, Nifty rebound | లాభాల దిశగా స్టాక్ మార్కెట్.. బిగ్ అప్‌డేట్‌

Sensex, Nifty rebound : భార‌తీయ స్టాక్ మార్కెట్ కాస్త కోలుకుంది. శుక్ర‌వారం ఉద‌యం సెన్సెక్స్, నిఫ్టీ (Sensex, Nifty) నష్టాలతో (early losses) ప్రారంభమైనప్పటికీ కొన్ని గంటల్లోనే లాభాల్లోకి ప్రవేశించాయి. విదేశీ పెట్టుబడుల‌కు (foreign fund inflows) ఈ స్థితి అనుకూలంగా మారింది. విదేశీ పెట్టుబ‌డిదారుల్లో న‌మ్మ‌కాన్ని పెంచి కొత్త ఆశ‌లు చిగురించింది. న‌ష్టాలతో ప్రారంభ‌మై.. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 252.8 పాయింట్లు పడిపోయి 76095.26 వద్ద ట్రేడయింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 57.85 పాయింట్లు తగ్గి 23132.80కి చేరింది. అయితే, కొంత సమయం గడిచిన తర్వాత మార్కెట్ తిరిగి కోలుకుంది. సెన్సెక్స్ 205.09 పాయింట్లు పెరిగి 76550.97 వద్దకు చేరగా, నిఫ్టీ 70.05 పాయింట్లు పెరిగి 23262.55 వద్ద స్థిరపడింది. Sensex, Nifty rebound : కంపెనీల‌కు లాభ, న‌ష్టాలు మార్కెట్‌లో ప్...
Tahsildar | సర్వే నెంబర్ 401 కథేంటి?
Special Stories

Tahsildar | సర్వే నెంబర్ 401 కథేంటి?

చర్చనీయాంశంగా హసన్ పర్తి తహశీల్దార్ లీలలు.. కాసులు కురిపించిన నాలా కన్వర్షన్ లు..? Hanmakonda : ఆ తహశీల్దార్ (Tahsildar) లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి, సదరు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలు మంత్రి కి సైతం ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సదరు తహశీల్దార్ గురించే మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ శాసనసభ ఎన్నికల కు ముందు బదిలీల్లో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి విధుల్లో చేరినప్పటినుండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న అక్రమ(అనుమతి లేని)వెంచర్ (Illegal venture) లలోని ప్లాట్లను వేంచర్ నిర్వాహకులకు అనుకూలంగా గజాల వారీగా ప్లాట్లను కన్వర్షన్ చేసి పెద్దమొత్తంలో ముడుపులు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా ఎప్పటినుండో వివాదాస్పదంగా ఉన్న ఓ భూమి నుండి 8 గుంటలు నాలా కన్వర్షన్ చేయడం ఇప్...
Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం
Crime

Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం

Accident in Mahabubabad : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట గ్రామంలోని పెద్దనగరం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇతరులకు స్వల్పంగానే కానీ రక్తస్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. బాధితులందరూ రోజువారీ కూలీ కార్మికులు, చెర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు.. మిర్చి కోత పనికి ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు. పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం (Tragic incident) చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వార...
error: Content is protected !!