Sarkar Live

Day: March 26, 2025

Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు
State

Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు

Telangana | రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు (Ration Card Holders ) సన్న బియ్యం సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన ఫైన్ రైస్ ను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోకుండా బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రూ.7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వండుకోకపోవడంతో అవి పక్కదారి పడుతున్నాయి. తమ ప్రభుత్వం ...
Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..
Cinema

Karthi New Movie | కార్తీ 29 వ మూవీ అప్డేట్..

Karthi New Movie : మొదటి నుండి హీరో కార్తీ (Karthi)తన మూవీస్ ని డిఫరెంట్ స్టైల్ లో తీస్తుంటాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన మూవీస్ కి సే మ్ క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ మూవీస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. రొటీన్ రొడ్డ కొట్టుడు మూవీస్ కాకుండా ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటాడు. ఖాకీ, ఖైదీ,సర్దార్, సత్యం సుందరం మూవీసే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.ఈ మూవీస్ ఫ్యాన్స్ ని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ సర్దార్ (sardar) సీక్వెల్ కూడా మొదలుపెట్టిన కార్తీ…లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)తో ఖైదీ సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajnikanth)తో కూలి మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దశలో ఈ మూవీ ఉంది. ఇది అయ్యాక ఖైదీ-2 పనులు మొదలుపెట్టపోతున్నార...
Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు
Career

Yuva Vikasam నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వందశాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు

TG Rajiv Yuva Vikasam తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసం పథకం నిరుద్యోగులకు వరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు మండలాలు, సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల విలువైన యూనిట్లకు 100 శాతం రాయితీ కల్పిస్తారు. ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.‌శ్రీధర్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓబీఎంఎంఎస్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం విధివిధానాలు ఇవీ.. య...
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు
State

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశాలు తీవ్ర చర్చలకు వేదిక అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చ చివరి దశకు చేరుకోగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం రగిలింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ (KT Rama Rao) చేసిన వ్యాఖ్యలు సభ (Telangana Assembly)లో దుమారం రేపాయి. కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. సభలో ప్రధానంగా పలు అంశాలపై చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, రెవెన్యూ, గృహనిర్మాణం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అదనపు వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా వీటి మొత్తాన్ని రూ.50,471 కోట్లుగా ప్రకటించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణలపై శాసనమండలిలో చర్చ జరగనుంది. అవయవదానం సంబంధిత తీర్మానాన్ని కూడా ప్రభుత్వం మండలిలో ప్...
Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం
Trending

Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం

Supreme Court stay : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మ‌హిళ ఛాతీని తాక‌డం గానీ, ఆమె పైజామా తాడును లాగ‌డం గానీ చేస్తే అది నేరం కిందికి రాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్న‌ట్టు ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ రోజు ప్ర‌క‌టించింది. అల‌హాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక మహిళను బలవంతంగా నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం దాడిగా పరిగణించాలి గానీ దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఓ కేసులో అల‌హాబాద్ హైకోర్టు మార్చి 17న తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మహిళా భద్రతకు విఘాతం క‌లిగించే తీర్పు అని, ఇది నిందితులను రక్షించేలా ఉంద‌ని న్యాయ నిపుణులు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు, సామాజికవేత్త‌లు అభ్యంత‌రం చె...
error: Content is protected !!