Sarkar Live

Day: April 5, 2025

Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం
State

Ram Navami | నేటి భద్రాద్రి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం

Bhadrachalam | దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రి(Bhadradri)లో శ్రీరామనవమి (Ram Navami) వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. ఆదివారం రాములవారి కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ, అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుడి పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. శుక్రవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. 6న నవమి రో...
Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..
State

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..

Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్ర‌భుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అంద‌జేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్ర‌ధాని మోదీ ఈ పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. శ్రీ‌లంక (Sri Lanka) ప‌ర్య‌ట‌న‌లో మోదీ ఉండ‌గా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్య‌క్ర‌మం ఇవాళ జ‌రిగింది. Mithra Vibhushana Award : అత్యున్న‌త పౌర పుర‌స్కారం మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరి...
Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్
Crime

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్

Deepfakes : దేశంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), కృత్రిమ మానవీయ మీడియా (synthetic media) ద్వారా జరిగే మోసాలు, అభద్రతలకు పాల్పడుతున్న క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Centre) మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల (social media platforms)ను హెచ్చరించింది. దేశ ప్రజలకు నమ్మకమైన, భద్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ (Deepfakes) అంటే ఏమిటి? డీప్‌ఫేక్ (Deepfakes) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారు చేసిన వీడియో లేదా ఆడియో. ఇందులో నిజంగా ఎవరూ మాట్లాడని మాటలు, చేయని చర్యలు ప్రోగ్రామ్ ద్వారా రూపొందించబడతాయి. ఎవరైనా ప్రసిద్ధ వ్యక్తి మాట్లాడినట్లు చూపించడం, వారు చేయనిది చేసినట్లు చూపించడం డీప్‌ఫేక్ అనే పద్ధతిలో సాధ్యమవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున...
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!
State, Trending

Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!

Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు ఏఐసీసీ (All India Congress Committee) అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివ‌ర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు న‌మోదు చేయ‌డం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమ‌మ‌ర్శ‌లు గుప్పుమ...
Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..
Cinema

Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..

Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి. రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ ప...
error: Content is protected !!