Sarkar Live

Day: April 8, 2025

Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..
State

Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..

Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే బాధ లేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామ‌ని వెల్లడించారు.రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే.. స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22...
Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…
Cinema

Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…

పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)ఏ సినిమా చేస్తాడో అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అట్లీ (Trivikram, Atlee)కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ ముందుగా ఎవరు డైరెక్షన్లో మూవీ మొదలు పెడతాడో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముందుగా త్రివిక్రమ్ మూవీనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అట్లీతో మూవీని కంప్లీట్ చేస్తాడని ఫాన్స్ ఊహించారు. అనుకున్న విధంగానే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ 22వ మూవీ(icon 22nd film)గా తెరకెక్కుతున్న ఈ మూవీని అట్లీ డైరెక్ట్ చేయబోతున్నట్లు, సన్ పిక్చర్స్(sun pictures)వారు ప్రొడ్య...
Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం
Career

Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం

Student visa : అమెరికా (US)లో చదువుతున్న విదేశీ విద్యార్థుల (international students)కు గ‌డ్డుకాలం మొదలైంది. చిన్న చిన్నట్రాఫిక్ ఉల్లంఘనలు (traffic violations) వంటి కారణాలతో విద్యా వీసా (Student visa)లను అక్కడి అధికారులు రద్దు చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల (Indian students)పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏం జరుగుతోంది అసలు? ఇటీవల అమెరికాలో ఉన్న వందలాది విదేశీ విద్యార్థుల (international students)కు వారి విద్యాసంస్థల నుంచి (Designated School Officials - DSOs) ఒక షాక్ ఇచ్చే ఈ-మెయిల్స్ వచ్చాయి. అందులో వారి F-1 విద్యార్థి వీసా రద్దు అయిందని, వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం (లేన్ మార్పు నిబంధనలు పాటించకపోవడం), మద్యం మత్తులో డ్రైవింగ్ లాంటి చిన్న చిన్న కార‌ణాలను చూపారు. ఈ నేరాలన్నీ విద్యార్థులు గతంలోనే చట్టపరంగా పరిష్క...
Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష
Cinema

Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష

Hyderabad Bomb blast Case : 2013లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన‌ హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ ఉగ్రవాదులు 2013లో జరిగిన బాంబు పేలుడు కేసులో దోషులుగా ఉన్నారు, ఈ బాంబు దాడిలో 18 మంది మరణించారు 131 మంది గాయపడ్డారు. జస్టిస్ కె. లక్ష్మణ్, పి. శ్రీసుధలతో కూడిన ధర్మాసనం ఐఎం ఉగ్రవాదులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ అప్పీల్‌ను కొట్టివేసింది, NIA కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ధృవీకరిస్తున్నట్లు బెంచ్ తెలిపింది. 2013లో ఘోర బాంబు పేలుడులో 18 మంది మృతి డిసెంబర్ 13, 2016న, NIA కోర్టు IM సహ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ సిద్దిబాప అలియాస్ యాసిన్ భత్కల్, పాకిస్తానీ జాతీయుడు జియా-ఉర్-రెహ్మాన్ అలియాస్ వ...
Check Post : మంత్రులుంటే మాకేంటి..?
Special Stories

Check Post : మంత్రులుంటే మాకేంటి..?

అశ్వరావుపేట చెక్ పోస్టులో యథేచ్ఛగా వసూళ్లు చెక్ పోస్ట్ దాటాలంటే మామూళ్లు సమర్పించాల్సిందే.. ఏసీబీ రైడ్ లు జరిగినా ఆగని మామూళ్ల దందా…? Ashwarao pet Check Post : మంత్రులుంటే మాకేంటి…?మా లెక్క మాకొచ్చిందా? లేదా..? ఏ వాహనం అయినా సరే మేము డిసైడ్ చేసిన మామూళ్లు సమర్పించాల్సిందే. ఏమన్నా అయితే మా ఉన్నతాధికారులు చూసుకుంటారనే రీతిలో ఆ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనదారుల నుండి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఉమ్మడి జిల్లాకు లేని ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రభుత్వంలో హేమాహేమీలుగా పేరుగాంచిన ముగ్గురు మంత్రులు అనగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పటికీ అశ్వరావుపేట చెక్ పో...
error: Content is protected !!