Sarkar Live

Day: April 13, 2025

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..
State

Traffic jam | శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌.. కార‌ణం ఇదే..

Srisailam highway Traffic jam : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం హైవే (Srisailam highway)లో ఈ రోజు అనూహ్య రీతిలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వేలాది మంది భక్తులు సేలేశ్వరం జాతర (Saleshwaram Jatara) కోసం తరలివస్తుండగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. ఈ రద్దీ వల్ల మహిళలు, పిల్లలు సహా పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర ఉష్ణోగ్ర‌త మ‌ధ్య అడవి ప్రాంతంలో వాహ‌నాలు ఆగిపోవడం భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. Traffic jam : చెక్‌పోస్టు వ‌ద్ద టూల్ వ‌సూలో ఆల‌స్యం మన్ననూర్ చెక్‌పోస్టు (Mannanur checkpost) వద్ద టోల్ ట్యాక్స్ వసూలులో ఆలస్యం కావ‌డం వ‌ల్లే ఈ ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం. వాహనాల నుంచి అటవీశాఖ టోల్ వసూలు (toll from vehicles) చేస్తుండగా భారీ ర‌ద్దీ ఏర్ప‌డింది. టోల్ వ‌సూలును సమర్థంగా నిర్వహించలేకపోవడం వల్లే వాహనాలు నిలిచిపోయా...
India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?
Technology

India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?

India lead global AI : గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (global artificial intelligence (AI) రంగానికి నేతృత్వం వ‌హించే దిశ‌గా భార‌తదేశం ముందుకు సాగుతోంద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) కార్యదర్శి ఎస్.కృష్ణన్ (S Krishnan) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ స‌మ్మ‌ట్ (Global Technology Summit) సంద‌ర్భంగా ఆయ‌న IANS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేట్ రంగాల్లో AI ని విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు ఇది సరైన సమయం అని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నాలజీ ఫ్రంట్‌లైన్‌లో భారత్ నిలవాలన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. Y2K మోమెంట్ (సంవత్సరం 2000కు ముందు) IT రంగం భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పటి AI పరిణామం కూడా అంతే గొప్పగా ఉండబోతుందని ఆయ‌న అన్నారు. India lead global AI : అభి...
Medaram | మేడారంలో పెద్ద పులి..  వణికిపోతున్న జనం
State

Medaram | మేడారంలో పెద్ద పులి.. వణికిపోతున్న జనం

Tiger Spotted in Medaram : తెలంగాణలోని ములుగు జిల్లా (Mulugu district) ప్రజలను మరోసారి పెద్దపులి (tiger) సంచారం భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాడ్వాయి మండ‌లం మేడారం, బ‌య్య‌క్క‌పేట‌ పరిసర అటవీ ప్రాంతాల్లో (forest areas) పెద్దపులి పాదముద్రలు (Footprints) కనిపించడం జిల్లా వాసుల్లో ఆందోళనకు దారితీసింది. అటవీ శాఖ అధికారులు (Forest department officials) పులి పాదముద్రలను గుర్తించారు. పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంటున్నారు. Medaram : ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు మేడారం, బయ్యక్కపేట (Medaram and Bayyakkapeta) అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు క‌నిపించిన నేప‌థ్యంలో ఫారెస్టు అధికారులు ఈ అంశాన్ని లోతుగా ప‌రిశీలిస్తున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ‌పూర్ మండ‌లం (Mahadevpur Mandal)లోని గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపిన త‌ర్వాత పులి మేడారం వైపు కదిలినట్టు అంచ...
HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి
State

HCU | హెచ్ సీయూ క్యాంపస్ లో మరో మచ్చల జింక మృతి

Spotted deer in HCU : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (HCU) క్యాంపస్‌లో శనివారం మరో మచ్చల జింక (Spotted deer) చనిపోయింది. కుక్కలు వెంబడించడంతో సరస్సులో పడి జింక చనిపోయిందని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ, విశ్వవిద్యాలయ భద్రతా అధికారులతో పాటు విద్యార్థులు జింకను బయటకు తీశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూమిలో కొంత భాగంలో చెట్లు తొలగించిన తర్వాత 10 రోజుల వ్యవధిలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో నాలుగు జింకలు మరణించాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మచ్చల జింకలు, ఇతర జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే, శుక్రవారం రాత్రి క్యాంపస్‌లో షెడ్యూల్ 1 సిరీస్‌లోని భారీ ఇండియన్ రాక్ పైథాన్ కనిపించింది. HCU పరిశోధకులు, ABVP అధ్యక్షుడు కె. బాల కృష్ణ మాట్లాడుతూ.. "క్యాంపస్‌లో వన్యప్రాణులు లేవని చెప్పుకునే నాయకులు దీనిని చూడాలని, ....
error: Content is protected !!