Sarkar Live

Day: May 14, 2025

మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway
State, warangal

మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway

Warangal : ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై నిలిచి ఉన్న రైళ్లలో ప్రయాణికుల వద్దకు నేరుగా రైల్వే సిబ్బంది నీళ్లు తెచ్చి ఇస్తున్నారు. దీంతో రైల్వే శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులకు తాగునీటి వసతులు కల్పిస్తున్నారు మరోవైపు రైల్వేల భద్రత విషయమై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ ప‌రిధిలో ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర...
Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు
State, Hyderabad

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ...
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!
State

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!

VIP Break Darshan : తిరులమ వేంకటేశ్వరస్వామి భక్తులకు (TTD Devotees) టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల (Tirumala)లో 15వ తేదీ గురువారం నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల తిరుమలలో భక్తుల కోలాహలం తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల్లో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డ...
Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ
National

Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ

Operation Keller | కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం, మే 13, 2025న భారత సైన్యం (Indian Armed Forces) ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు అందింది. దీంతో వెంటనే 'ఆపరేషన్ కెల్లర్'గా కోడ్ నేమ్ తో సైనిక చర్యను ప్రారంభించిది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేయబడిన అధికారిక ఆర్మీ ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) . మే 13, 2025న, #షోపియన్‌లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ ఇచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, #ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. దీని ఫలితంగా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసా...
error: Content is protected !!