Sarkar Live

Day: May 16, 2025

Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
State

Miss World 2025 : పాలమూరులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు

Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు. 16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన శాల ను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలు, తెలుసుకున్నారు. మ్యూజియం వద్ద రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోటోలు దిగారు. అనంతరం పిల్లలమర్రి మహా వృక్షం సందర్శించారు. Miss World...
Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్
State

Telangana power : తెలంగాణలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్

Telangana power : తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 9.8 శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా పెరుగుతుందని, సుమారుగా 18000 మెగావాట్లకు పైగా చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.శుక్రవారం, మే 16న ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు విద్యుత్ శాఖ ఈ విషయం గురించి వివరించింది. 2034 – 2035 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లు ఉండవచ్చని అంచనా వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రం (Data Centers )గా మారుతున్న దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధునాతన మ...
SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..
State

SCR | రైలు ప్రయాణికులకు శుభవార్త చ‌ర్ల‌ప‌ల్లి – విశాఖ మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..

SCR | వేస‌వి సెలవుల్లో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. ఈ మేరకు చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli) – విశాఖ‌ప‌ట్నం (Vishakhapatnam) మ‌ధ్య రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మే 17న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లి నుంచి విశాఖ‌ప‌ట్నంకు(07441) రైలు బ‌య‌ల్దేర‌నుంది. మే 18న రాత్రి 11 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి చ‌ర్ల‌ప‌ల్లికి(07442) రైలు బ‌య‌ల్దేర‌నుంది. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌లో 3ఏసీ, 3ఏసీ(ఎకాన‌మీ) క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. SCR : హైదరాబాద్ నుండి కలబురగికి ప్రత్యేక రైళ్లు ఉర్స్-ఎ-హజ్రత్ ఖ్వాజా బందన్ నవాజ్ పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి కలబురగి (Gulbarga) మధ్య ప్రత్యేక అన్ రిజర్వ్డ్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకట...
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..
Hyderabad, State

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..

Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ (Fare Revision)లను సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అమలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Hyderabad Metro : తక్కువ దూరాలకు చార్జీలు 2 కి.మీ వరకు దూరాలకు ఛార్జీ రూ.122 కి.మీ నుంచి ఎక్కువ, 4 కి.మీ వరకు రూ.18;4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు ఛార్జీ రూ.306 కి.మీ నుంచి 9 కి.మీ వరకు,ఛార్జీ రూ.409 కి.మీ కంటే ఎక్కువ 12 కి.మీ వరకు ఛార్జీ రూ.50 ఎక్కువ దూరాలకు ధ...
error: Content is protected !!