Sarkar Live

Day: May 23, 2025

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్‌.. : kalvakuntla kavitha
State

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్‌.. : kalvakuntla kavitha

కేసీఆర్ దేవుడ‌ని,కానీ ఆయ‌న‌చుట్టూ దెయ్యాలున్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత (kalvakuntla kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మ‌ని అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని క‌విత పేర్కొన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల కార‌ణంగానే బయటకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్‌కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానన్నారు. పాజిటివ్, నెగటివ్ అంశాల‌పై త‌ర‌చుగా లేఖ‌లు రాస్తుంటానని క‌ల్వ‌కుంట్ల చెప్పారు. దాన్ని ఎవరూ బ‌హిర్గ‌తం చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాల్సి ఉంద‌న్నారు. నా లేఖను ...
ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి
Crime

ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి

అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విఠల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.8 లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. రూ.4 లక్షలు తీసుకుని మరో రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సికింద్రాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ విఠల్ రావు.. రెండు బిల్డింగ్​ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్​ చేశారు. మొదటి విడతలో 4ల...
Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ
Crime

Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ

Kamareddy : కామారెడ్డిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం (Bribe) డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420 కింద నమోదు చేయబడిన చీటింగ్ కేసుకు సంబంధించిన క్రైమ్ నంబర్ 375/2018 ప్రకారం ఫిర్యాదుదారునిపై కేసు విచారణ త్వరగా పూర్తి చేయడానికి, కేసులో నిర్దోషిగా విడుదల చేయడానికి అనుకూలంగా వ్యవహరించినందుకు సంజయ్ ద్వారా లంచం తీసుకున్నారు. మొదట్లో నాయక్ రూ.15,000 లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.10,000కి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. సంజయ్ వద్ద నుంచి ACB అధికారులు రూ.10,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్...
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II
State, Hyderabad

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపీఆర్ రెడీ.. – Hyd Metro Phase II

Hyd Metro Phase II : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-II (బి) కారిడార్‌లైన JBS - మేడ్చల్, JBS - షామీర్‌పేట్, విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPRలు) పూర్తిగా సిద్ధమ‌యయ్యాయి. కొత్త డీపీఆర్ లు మే 8న హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు ఆమోదించిందని మెట్రో రైలు అధికారులు తాజాగా ధృవీకరించారు. ప్రతిపాదిత JBS-షామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 1.65 కి.మీ అండ‌ర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా ఉంది. డీపీఆర్‌లు ప్రస్తుతం ప్రభుత్వ సమీక్షలో ఉన్నాయని HAML మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందే వరకు కొన్ని వివరాలు గోప్యంగా ఉండాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ అంచనాలు, హైదరాబాద్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ల (Hyd Metro Phase II DPRs) ను సమగ్ర...
ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19
State, AndhraPradesh

ఏపీలో కొవిడ్ కేసు.. ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు -COVID-19

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో COVID-19 ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు వంటి బ‌హిరంగ‌ సమావేశాలను నిలిపివేయాలని ప్రజలను కోరింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణులు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు పరిశుభ్రత పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు, ఇందులో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు, తుమ్ములు వ‌చ్చిన‌పుడు ముఖాన్ని తాకకుండా ఉండటం వంటివి చేయాల‌ని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా సరిగా గాలి లేని ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని అభ్యర్థించింది. అంతకుముందు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ...
error: Content is protected !!