Sarkar Live

Day: June 9, 2025

బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!
Cinema

బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!

Akhanda 2 Teaser | బోయపాటి బాలయ్య కాంబోలో (Boyapati- Balayya combo) వచ్చిన అఖండ (Akhanda) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు. బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన మాస్ యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్టును అందించింది. అంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రజెంట్ అఖండ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 (Akhanda 2)మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.దీంతో పాటే మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేసింది.బాలయ్య మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, డివోషనల్ వైబ్ తో టీజర్ అదిరిపోయింది. స్టార్టింగ్ లో నే బాలయ్య హిమాలయాల్లో శ...
Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Crime, National

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్ర‌యాణికులు కిక్కిరిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగ...
Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..
Crime

Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..

Chhattisgarh Maoist Attack | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో మావోయిస్టులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీ (IED Blast)తో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే (Akash Rao Giripunje) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారని ఐజి బస్తర్ పి. సుందర్‌రాజ్ ధృవీకరించారు. “ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కొంటా ఆసుపత్రికి తరలిస్తుంగా ఆయ‌న మృతిచెందారు. గాయపడిన ఇతర సిబ్బంది పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఐజి తెలిపారు. IED పేలుడులో కొంటా SDPO, స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ కూడా గాయపడ్డారు, వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ పోలీసుల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ASP గిర్పుంజే బలిదానం ఆ దళానికి తీవ్ర నష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
error: Content is protected !!