Sarkar Live

Day: June 11, 2025

Telangana Cabinet | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
State, Hyderabad

Telangana Cabinet | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

Telangana Cabinet 2025 | తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ( Portfolio Allocation)కేటాయించారు. కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రిగా గ‌డ్డం వివేక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్, క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్నారు. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సైతం ఇప్పటికే సిద్ధమ‌య్యాయి. వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్‌ అండ్‌ యువజన సర్వీసులు శాఖ గడ్డం వివేక్‌: కార్మిక, మైనింగ్‌ శాఖలు అడ్లూరి లక్ష్మణ్‌ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఇక కొత్తగా మంత్రివ‌ర్గంలోకి వచ్చిన ఈ ముగ్గురు మొద‌టిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.. వివేక్ గతంలో ఎంపీగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి ...
Tatkal Ticket | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రైల్వే తత్కాల్ టిక్కెట్ల జారీకి కొత్త రూల్స్
Trending

Tatkal Ticket | ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. రైల్వే తత్కాల్ టిక్కెట్ల జారీకి కొత్త రూల్స్

IRCTC New Rules in Tatkal Ticket Issue | జూలై 1 నుంచి తత్కాల్ కేటగిరీ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నియమాలు ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను మ‌రింత సులువు చేయ‌డ‌మే కాకుండా మోసాలను నివారిస్తాయ‌ని భావిస్తున్నారు. ఏజెంట్లు, బాట్‌ల కారణంగా టిక్కెట్లు మాయమవుతున్నాయని ప్రయాణీకుల ఫిర్యాదుల నేపథ్యంలో కొత్త నియమాలు వచ్చాయి. అయితే, నిబంధనలలో మార్పులు ప్రయాణికులకు ఉపశమనం కలిగించవచ్చు. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వారికి మ‌రిన్ని సౌక‌ర్యాలు ఇవ్వొచ్చు. Tatkal Booking : తత్కాల్ బుకింగ్ నిబంధనలలో మార్పులు భారత రైల్వేలు ప్రకటించిన మార్పుల ప్రకారం, జూలై 1 నుంచి ఆధార్-ప్రామాణీకరించబడిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ పథకం కింద టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, "ఆధార్ క...
తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం  – Anganwadi Egg Biryani
State, Hyderabad

తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం – Anganwadi Egg Biryani

Anganwadi Egg Biryani | వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers ) తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే థీమ్‌తో నిర్వహించిన ర్యాలీల్లో చిన్నారులకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు మొదటిరోజు చిన్నారులకు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ (Egg Biryani in Anganwadi centers)’ ని మ‌ధ్యాహ్న భోజ‌నంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం. Egg Biryani : అంగన్ వాడీల్లో వెరైటీ ఫుడ్ ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు తగినట్లుగా ఆహారంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.. చిన్నారులకు వెరైటీ ఫుడ్ అం...
ACB Raids | హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
Crime

ACB Raids | హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ACB Raids : రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు (ACB Raids) చేస్తున్నారు.హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నూనె శ్రీధర్ (Nune Sridhar) ఇంట్లోబుధవారం ఏసీబీ అధికారులు (ACB Officers) . తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో శ్రీధర్‌కు సంబంధించిన 20 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నది. ఏసీబీ అధికారులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లో శ్రీధర్ విధులు నిర్వర్తించారు. అయితే నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Irrigation Engineer Corruption) ను ఏసీబీ అధికారులు ఫైల్ చేశారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులు ఎక్కడ జరిగాయి? Telangana Irrigation Engineer Corruption : కాగా కరీంనగర్‌ (Karimnagar) లో శ్రీధర్‌ను ...
KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్
State, Hyderabad

KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్

'నిజం బయటపడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి Kaleshwaram Commission | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా, కిరీట రత్నంగా పరిగణించబడే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. బీఆర్‌కే భవన్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయి. ప్రాజెక్టులోని రెండు బ్యారేజీల వద్ద ప్రమాదం జరిగింది. త్వ‌ర‌లో నిజం బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో ఈ వేధింపులకు తగిన గుణ‌పాఠం చెబ‌తారు. ఇది కా...
error: Content is protected !!