Sarkar Live

Day: June 24, 2025

ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ
Crime

ACB Investigation | అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్‌ ఈఈ శ్రీధర్‌ విచారణ

ACB Investigation | అక్రమ ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఐదో రోజు విచారించారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో శ్రీధర్‌ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్‌ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా లెక్కించిక కొద్దీ పెరిగిపోతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు ...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్య‌ద‌ర్శి

రూ.21వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి.. Nirmal News | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ (Panchayat Secretary) శివకృష్ణ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Trap) ప‌ట్టుబ‌డ్డాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గోడిసెర్యాల గ్రామానికి చెందిన జి.రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవ‌డానికి గాను పంచాయతీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద అనుమ‌తి కోరాడు. దీంతో కార్య‌దర్శి శివ‌కృష్ణ‌ 12 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రాజేశం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ACB అధికారులకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా స...
Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు
Special Stories

Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు

రంగురంగుల బ్రోచర్ల మాయలో పడిపోతున్న తల్లిదండ్రులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తోంది? Education Scam in Hanmakonda | ఆకర్షణీయమైన యాడ్ లు, నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే బ్రోచర్ లు, మాయమాటలతో కనికట్టు చేసే పిఆర్వోలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీగా ప్రచారం చేసుకోవడంలో రెజోనెన్సు కళాశాల యాజమాన్యం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పెద్ద ఎత్తున అడ్మిషన్లనే టార్గెట్ గా పెట్టుకున్న సదరు కళాశాల యాజమాన్యం.. ఎక్కడ ఖాళీ బిల్డింగ్ దొరికితే చాలు అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజీ కి అనుమతులు ఎన్ని? వారు నిర్వహిస్తున్న బ్రాంచీలు ఎన్ని ? అనే విషయం ఇప్పుడు ఇటు విద్యాశాఖతో పాటు అటు హన్మకొండ నగరంలో చర్చనీయాంశంగా...
error: Content is protected !!