Sarkar Live

Day: June 28, 2025

Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు
Crime

Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు

మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ధర్మసాగర్‌ ‌మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘ‌ట‌న జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ ‌కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింస‌ల‌కు గురిచేశారు. తప్పు చేశాన‌ని క్షమించమ‌ని వేడుకున్నా వినకుండా దాడికి పాల్ప‌డ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్...
ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..
Crime

ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..

ఏసీబీ దాడుల్లో ఒకే రోజు ముగ్గురు లంచావతారుల అరెస్టు.. పెద్దపల్లిలో రూ.5వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ముసిసిప‌ల్ ఉద్యోగులు ACB Raids in Telangana | అవినీతి నిరోధ‌క శాఖ‌ లంచగొండి అధికారుల భ‌ర‌తం ప‌డుతోంది.. ప్ర‌తీరోజు బాధితుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో ఆక‌స్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగాఇంటి నంబర్‌ కోసం రూ. 5000 లంచం డిమాండ్‌ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. పెద్ద‌ప‌ల్లిలోని ద్వారకా నగర్ కు చెందిన ఎ.ప్రసాద్ అనే వ్యక్తి కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు. కాగా బాధితుడిని ఏడాది పాటు ఆర్‌ఐ వినోద్‌, బిల్‌ కలెక్టర్‌ నాంపల్లి విజయ్‌కుమార్‌ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస...
Warangal Politics | గాంధీభవన్‌ లో కొండా మురళి రివర్స్ కౌంటర్..
Special Stories

Warangal Politics | గాంధీభవన్‌ లో కొండా మురళి రివర్స్ కౌంటర్..

క్రమశిక్షణా కమిటీ ముందు భేటీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై 15పేజీలతో నివేదిక అందజేత జిల్లా పార్టీ నేతలకు రివర్స్ కౌంటర్! వరంగల్ కాంగ్రెస్‌లో కలకలం Warangal Politics : కొండా మురళి (Konda Murali) వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan) లో కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. అయితే కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి ఊహించ‌ని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వివరణ ఇస్తారని.. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుంద‌ని అనుమానిస్తున్న త‌రుణంలో అనూహ్యంగా కొండా ముర‌ళి రివర్స్‌ కౌంటర్‌కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్‌ కీలక నేతలపైనే కమిటీ (Disciplinary Committee)కి 15 పేజీల‌తో కూడిన నివేదిక అందించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్...
Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి
Crime, Hyderabad

Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి

Hyderabad News | ప్రముఖ తెలుగు టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్ హౌస్ లో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈమేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎస్ఆర్‌ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు (14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొన...
error: Content is protected !!