Sarkar Live

Day: July 15, 2025

Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..
Crime

Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..

Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ ప‌చ్చ‌ని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం క‌ట్టుకున్న‌ భర్తను అంత‌మొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచార‌ణ‌తో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అంద‌రినీ తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు, స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ ...
Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..
Special Stories

Job Scam | రూ.2 లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు..

అటవీ శాఖలో ఉద్యోగం పేరుతో మోసం అడ్వాన్స్ లక్ష.. విధుల్లో చేరాక మరో లక్ష అంటూ నిరుద్యోగిని మోసం చేసిన మహిళ ఉద్యోగం కల్పించలేదు..? డబ్బులు తిరిగి చెల్లించరు..? Job Scam in Hanmakonda | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్న తపన.. ఓ ఆఫీసులో ఉద్యోగాలు పెట్టిస్తున్నారన్న వార్త తన చెవిలో పడింది. గంపెడాశలతో ఆ ఆఫీసుకు వెళ్లిన సదరు వ్యక్తికి వాళ్ళు చెప్పిన కహానీ ఆశలు రేకెత్తించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అందులోనూ అటవీ శాఖ (Forest Department) లో ఇంకేముంది ఇంటికెళ్లి తల్లిదండ్రులను ఒప్పించాడు వాళ్ళు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఎలాగోలా సమర్పించుకున్నాడు. నెల రోజుల్లో ఉద్యోగంలో చేరవచ్చు, ఉద్యోగం కోసం తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చిన అప్పు కట్టచ్చని భావించిన సదరు నిరుద్యోగికి నెల రోజులకే ఊహించని షాక్ తగిలింది. డబ్బులు చెల్లించి నాలుగు నెలలు గడిచింది.. ఇంకా ఉద్యోగం రావట...
ACB Rids | ఏసీబీ అదుపులో  ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్
State, Hyderabad

ACB Rids | ఏసీబీ అదుపులో ఇరిగేషన్ మాజీ చీఫ్ ఇంజనీర్

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు.. Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈఎన్‌సీ జనరల్‌ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు...
Hyderabad |  హైదరాబాద్ లో  కాల్పుల కలకలం
Crime

Hyderabad | హైదరాబాద్ లో కాల్పుల కలకలం

Hyderabad Breaking News | హైదరాబాద్ లోని మలక్ పేటలో ఈ రోజు ఉదయాన్ని కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  సీపీఐ (CPI) నాయకుడు చందు నాయక్ (43) మృతిచెందాడు. మంగళవారం శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం నడకకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి కారులో పరారయ్యారు. దుండగులు. హత్య సమయంలో ఐదురుగు మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు. నాయక్ తోడుగా వస్తున్న ఆయన భార్య, కూతురు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన చందు నాయక్ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి ఫోరెన్స...
error: Content is protected !!