Sarkar Live

Day: July 26, 2025

Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే  పారిపోయిన పంచాయతీ కార్యదర్శి
Crime

Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే పారిపోయిన పంచాయతీ కార్యదర్శి

Telangana ACB Raids | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ (Panchayat Secretary) కార్యదర్శి సురేందర్‌ (Surendar)పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.50 వేలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నించగా నిందితుడు సురేందర్ పరారయ్యాడు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన ఎస్‌యూవీ కారులో సంఘటనా స్థలం నుంచి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్లాడు. తన కారు తన ఇంటి వద్ద నిలిపి తన బావమరిది కారు తీసుకొని అతనికి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం తాలుకు నగదు ...
Pension : జర్నలిస్టుల పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచిన ప్ర‌భుత్వం
National

Pension : జర్నలిస్టుల పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచిన ప్ర‌భుత్వం

Bihar News : బీహార్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జర్నలిస్టుల పెన్షన్ (Journalist Pension) మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీంతో బీహార్‌లో జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ యోజన (Patarkar Samman Pension Yojana) కింద, ఇప్పుడు అర్హత ఉన్న జర్నలిస్టులంద‌రికీ ప్రతి నెలా రూ. 6 వేలకు బదులుగా రూ. 15 వేల పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ (Nitish Kumar) ఈ విష‌యాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. ఎక్స్‌లో ఆయ‌న ఒక పోస్టులో.. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 6,000 కు బదులుగా రూ. 15,000 పెన్షన్ అందించాలని శాఖను ఆదేశించినట్లు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. అలాగే, బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే,...
error: Content is protected !!