Sarkar Live

Day: August 8, 2025

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Hyderabad, State

Hyderabad Rains | మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్ర...
Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య
Crime

Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య

Janagama : జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్య (Murder )కు గురికావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్‌గఢ్‌ మండలం తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
error: Content is protected !!