Sarkar Live

Day: August 20, 2025

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..
Hyderabad, State

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈమేర‌కు గురువారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఇక శుక్రవారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...
Registration Buildings |  సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు
State, Hyderabad

Registration Buildings | సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు

ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు Integrated Registration Buildings : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధ‌వారం గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన సంద‌ర్బంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగించారు. దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క‌టిగా అభివృద్ది కార్యక్ర‌మాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల శంకుస్దాప‌న అని వివ‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలోగ‌ల ...
Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?
National

Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?

లోక్‌సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను ప‌ద‌వి నుంచి తొలగించేందుకు లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్న‌ట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలల‌కు పాల్ప‌డి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాల‌కుల‌ను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి ...
error: Content is protected !!