Sarkar Live

Day: September 1, 2025

Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు
State

Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం (Kaleshwaram )పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “కేసీఆర్‌పై నిందలు రావడానికి ప్రధాన కారణం హరీష్‌రావేనా? ఆయన వెనుక సంతోష్‌, సీఎం రేవంత్‌ ఉన్నారా? నా మీద పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీకి కారణం అదే. నా కడుపు రగిలిపోతుంది” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. “మా నాన్న కేసీఆర్‌కి తిండి మీదా, డబ్బు మీదా ఎలాంటి ఆపేక్ష లేదు. ఆయన తరతరాల సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చారు. కానీ ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే ఈ పరిస్థితే వచ్చింది. కాళేశ్వరం వివాదం మొత్తం అప్పటి మంత్రి హరీష్‌రావు వల్లే జరిగింది. కేసీఆర్‌కి అవినీతి మరక ఎలా వచ్చింది అనేది అందరూ చూడాలి. కేసీఆర్‌పై విచారణ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. “నేను ఇలా మాట్లాడితే పార్టీకి స్థాని...
Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి
Crime, Mahaboobnagar

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

Mahbubnagar Bus Accident : మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రైలర్ ట్రక్కును ఒక ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదం (Accident) లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. 32 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గ‌ణేష్ ఊరేగింపులో.. West Godavari Accident : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో గణేష్ ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, ఒక మైనర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేష్ ...
Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం
State

Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం

Hyderabad : తెలంగాణ శాసన మండలి (Legislative Council) సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూడు కీలక బిల్లులను మండలి ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘాల చట్ట సవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు లెజస్లేటివ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఒక‌వైపు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొన‌సాగుతుండ‌గానే మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిల ఉండ‌గా బీఆర్ఎస్ సభ్యులు త‌మ నిర‌స‌న‌ల‌ను ముమ్మ‌రం చేశారు. చైర్మన్‌ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్ట‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో శాసన మండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబ...
error: Content is protected !!