Sarkar Live

Day: September 14, 2025

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?
State, Nalgonda

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao ) విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...
సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline
State, Karimnagar

సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline

Sircilla Vemulawada Railway Lline : ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఎట్టకేలకు సిరిసిల్ల జిల్లా (Rajanna sircilla district )కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రైల్వే అధికారులు సిద్దిపేట (Siddipet) శివార్లలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్ గ్రామాల మీదుగా మందపల్లి వరకు విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్-కొత్తపల్లి (Manoharabad Kothapalli Line ) రైల్వే ప్రాజెక్ట్ 162 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఈ రైల్వేలైన్‌కు ₹1,162 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచ‌నా వేసింది. ఇందు కోసం ₹350 కోట్లు కేటాయించింది. వీటిలో గత బడ్జెట్ నుంచి ₹165 కోట్లు ఉన్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట విభాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట-సిరిసిల్ల‌ మార్గంలో ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ త్వరలో తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటుందని రైల...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...
error: Content is protected !!