Sarkar Live

Day: September 17, 2025

Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..
State, Hyderabad

Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టు (Bharat Future City)పై వెనుక‌డుగు వేసేది లేద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (development of the State)కి ఇది త‌ప్ప‌నిస‌రి అన్నారు. రైతుల నిర‌స‌న‌ల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్ల‌ను ఇవ్వాలని నోటిఫై చేసిన గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ (Hyderabad)లో ఈ రోజు జ‌రిగిన తెలంగాణ ప్ర‌జా ప‌రిపాల‌న దినోత్స‌వం (Telangana Praja Palana Dinotsavam) సంద‌ర్భంగా సీఎం త‌న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై మ‌రోసారి మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే ప్ర‌తిప‌క్షాల ఉద్దేశం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల (opposition parties) ప్రేరేపించ‌డం వల్లే జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి రేవంత్‌...
Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
Business

Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు

Next Gen GST : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు (reforms) అమలులోకి వచ్చి రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి చేర్చబడ్డాయని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజల జేబుల్లో మరింత డబ్బు మిగిలి సాధారణ కుటుంబాల ఖర్చులకు ఊరటనిచ్చిందని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన Next Gen GST Reforms Outreach and Interaction Programలో ఆమె ప్ర‌సంగించారు. Next Gen GST : ప్ర‌జ‌ల చేతుల్లో మిగులు డ‌బ్బులు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసి, ప్రజలకు ఆర్థికంగా ఊతం అందించామని నిర్మ‌లా సీతారామ‌న్ వివరించారు. గతంలో 12 శాతం జీఎస్టీ కింద ఉన్న వస్తువులలో 99 శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం స్లాబ్‌లోకి మ...
Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌
State, Hyderabad

Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవ‌లు బంద్ అయ్యాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు రాక‌పోవ‌డంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల (Private hospitals) యాజ‌మాన్యాలు చేతులు ఎత్తేశాయి. త‌మ‌కు బ‌కాయి ఉన్నవేల‌కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌మ‌ని అనేక సార్లు విన్న‌వించినా రాష్ట్ర ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్ట‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలంగాణ ఆరోగ్య‌శ్రీ నెట్‌వ‌ర్క్ అసోసియేష‌న్ (TANHA) ప్ర‌క‌టించింది. విఫ‌లమైన చ‌ర్చ‌లు.. నిలిచిపోయిన సేవ‌లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగ‌ళ‌వారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొన‌సాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్ర‌తినిధులు ఓ...
Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh
State, Hyderabad

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత‌ నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవ‌రి జోక్యం అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భారతదేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం లిబ‌రేష‌న్ డే (Hyderabad Liberation Day)ను ప్ర‌తి సంత్స‌రం నిర్వ‌హిస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుక‌లు ఇవాళ ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా హాజ‌రైన రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీల‌క...
Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి
Crime

Digital arrest | ప్రాణాలు బ‌లిగొన్న సైబ‌ర్‌నేర‌గాళ్లు.. రిటైర్డ్ డాక్ట‌ర్ మృతి

Digital arrest in Hyderabad : ఆమె ప్రభుత్వ వైద్యురాలిగా (Retired doctor ప‌నిచేసింది.. శారీర‌క, మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు చికిత్స చేసింది. రోగుల‌కు మందుల‌తోపాటు మ‌నోధైర్యాన్ని నూరిపోసి ప్రాణాల‌ను కాపాడింది. ఎలాంటి సంద‌ర్భాల్లోనైనా గుండె నిబ్బ‌రం చేసుకోవాలని చెప్పిన ఆమె.. చివ‌రిగా సైబ‌ర్ నేరగాళ్ల ఉచ్చులో ప‌డి భ‌యాందోళ‌న‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. హైద‌రాబాద్ (Hyderabad)లో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపింది. సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా అమాయ‌కుల‌ను వలలోకి దింపుతున్నారో ఇది గుర్తుచేసింది. Digital arrest : 70 గంట‌లపాటు వేధించి.. బాధితురాలు (76) రిటైర్డ్ వైద్యురాలు. సాధారణంగా తన పింఛను మీద ఆధారపడుతూ ప్రశాంత జీవితం గడుపుతోంది. సెప్టెంబ‌రు 6న ఆమెకు ఓ ఫోన్‌కాల్ వ‌చ్చింది. లిఫ్టు చేసిన వెంటనే అవ‌తలి వ్య‌క్తులు త‌మ‌ను తాము పోలీ...
error: Content is protected !!