Sarkar Live

Day: September 18, 2025

Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం
State, warangal

Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం

Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్య...
Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు
Crime

Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు

Wanaparthy District : మ‌రో ఇద్ద‌రు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారుల‌కు చిక్కారు. వ‌న‌ప‌ర్తి జిల్లా (Wanaparthy) కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవో (RDO)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆర్డీఓ కొత్తకోట ఎమ్మార్వోకు పంపారు. దీంతో తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎమ్మారై వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్ద‌రు సదరు రైతు నుంచి రూ.40 వేలు ఇస్తేనే ప‌నిచేసి పెడ‌తామ‌ని చెప్పారు. స‌ద‌రు రైతు అంత‌పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌లేని మొర‌పెట్టుకున్నా వారు విన‌లేదు.దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండ్‌ చేసినట్లు ఆధారాలను సే...
TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
State, Hyderabad

TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు TGSRTC Special Buses 2025 : బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను (Bathukamma Dasara Special Services) బస్సులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈనెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీ...
ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops
State, Hyderabad

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops

Cow’s Last Rites: హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Cops) త‌మ సామాజిక బాధ్య‌త‌ను (social responsibility) చాటుకున్నారు. మృతి చెందిన ఆవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంత్యక్రియ‌లు (Cow’s Last Rites) నిర్వహించారు. ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెస్లీ, మొబైల్ కానిస్టేబుల్ టి. సురేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి సెంట‌ర్‌లో రోడ్డుపై చ‌నిపోయి ఉన్న ఆవు కనిపించింది. దీంతో వారిద్ద‌రు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను క్ర‌బ‌ద్ధీక‌రించారు. సొంత ఖ‌ర్చుతో అంత్య‌క్రియ‌లు పోలీసులు కాంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆవు మృతదేహాన్ని త్రిముల్‌ఘెర్రీలోని గాంధీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గుంత తవ్వించి సమాధి చేశారు. ఈ అంత్యక్రియల (final rites)కు సంబంధించిన ఖర్చును స్వయంగా ఆ ఇద్దరు అధికారులే భరించారు. Hydera...
TGSRTC job notification | యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో ఉద్యోగావ‌కాశం
Career

TGSRTC job notification | యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీలో ఉద్యోగావ‌కాశం

TGSRTC job notification 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో కొత్తగా ఉద్యోగాల నియామ‌కాల‌కు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 1,743 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ పూర్తి చేసిన యువ‌త ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 2025 అక్టోబ‌రు 8 నుంచి అక్టోబ‌రు 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని TGSRTC త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.. TGSRTC job notification 2025 : డ్రైవర్ పోస్టుల వివరాలు పోస్టుల సంఖ్య : 1000 వయో పరిమితి : కనీసం 22 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు ఉండాలి. విద్యార్హత : కనీసం ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యుండాలి. ఇత‌ర అర్హతలు: హేవీ ప్యాసింజ‌ర్ మోటార్ వెహికిల్ (HPMV) లేదా హేవీ గూడ్స్ వెహికిల్ (HGV) లైసెన్స్ లేదా సరైన ట్రాన్స్‌ప...
error: Content is protected !!