Sarkar Live

Day: September 18, 2025

Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి
State, Hyderabad

Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి

Hyderabad rains : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మరో ప్రాణాన్ని బలిగొంది. ముషీరాబాద్‌కు చెందిన యువ‌కుడు నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం అతడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం బాల్కంపేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే.. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో షరీఫుద్దీన్ (27) తన బైక్‌పై బాల్కంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు మొత్తం నీళ్లు ముంచెత్తాయి. బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక వాహనం సహా ష‌రీఫ్ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ ల‌భించ‌లేదు. చివరికి గురువారం ఉదయం అతడి మృతదేహం బాల్కంపేట్ అండర్‌పాస్ దగ్గర లభించింది. Hyderabad లో వ‌ర్ష‌పాతం ఇలా.. బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంపై ఒక్కసారిగా భారీ వర్షం కు...
Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం
State, Nalgonda

Miryalaguda : పెళ్లి రిసెప్ష‌న్‌ను ర‌ద్దు చేసి.. రైతుల‌కు ఆర్థిక సాయం

Miryalaguda MLA : ఎంతో ముచ్చ‌ట‌ప‌డి కొడుకు పెళ్లి చేశారాయ‌న‌. బంధుమిత్రులను ఆహ్వానించి అత్యంత వైభ‌వంగా రిసెప్ష‌న్ (marriage reception)ను అరేంజ్ చేద్దామ‌ని ఉన్నా ఆ కోరిక‌ను అంత‌టితోనే తుంచేశారు. రిసెప్ష‌న్‌కు అయ్యే ఖ‌ర్చును ఆదా చేసి రైతుల‌కు యూరియా కోసం సాయం చేశారు. మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి (Miryalaguda MLA Battula Laxma Reddy) చాటుకున్న దాతృత్వం ఇది. ఆర్భాటాలు వ‌ద్ద‌నుకొని అన్న‌దాత‌కు ఆస‌రా ఎమ్మెల్యే బ‌త్తుల లక్ష్మా రెడ్డి త‌న కుమారుడు సాయి ప్రసన్న‌(Sai Prasanna) కు భవ్యమైన వివాహ విందును ఏర్పాటు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. రైతుల దుర్భర పరిస్థితులు ఆయనను కలచివేశాయి. వర్షాభావం, పెరిగిన ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన, విందు ఖర్చును రైతుల సంక్షేమం కోసం మళ్లించాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్...
error: Content is protected !!