Sarkar Live

Day: October 3, 2025

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
Hyderabad

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల‌ విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...
Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం
State, Hyderabad

Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం

జీటో కనెక్ట్‌ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధ‌ర్ బాబు Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌ (Hyderabad itex), హెచ్‌ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్‌ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగ...
Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
National

Karur stampede : కరూర్ తొక్కిసలాట కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మధురై: కరూర్‌లో జరిగిన దారుణమైన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలన్న వాదనను తిరస్కరించింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సభలు, ర్యాలీల్లో తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఎందుకు కల్పించలేదని టీవీకే పార్టీని ప్రశ్నించింది. నీళ్లు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ వంటి అవసరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు సమావేశం నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులు వివరణ ఇవ్వాలని కోరింది. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న‌టుడు విజ‌య్ పర్య‌ట‌న‌లు వాయిదా ఈ ఘటన నేపథ్యంలో టీవీకే పార్టీ అధ...
టెలికాం రంగంలో మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా eSIM సేవ ప్రారంభించిన BSNL
Technology

టెలికాం రంగంలో మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా eSIM సేవ ప్రారంభించిన BSNL

ఇప్పటివరకు, భారతదేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రమే eSIM సౌకర్యాన్ని అందించేవి. కానీ ఇప్పుడు BSNL కూడా ఈ సేవను ప్రారంభించింది. అంటే మీరు ఫిజిక‌ల్ సిమ్ కోసం ఒకే స్లాట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తే, మీరు ఇప్పుడు BSNLను eSIMగా ఉపయోగించగలరు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ సేవ కోసం BSNL టాటా కమ్యూనికేషన్స్‌తో ఒప్పందం క‌దుర్చుకుంది. టాటా కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ "MOVE" eSIM సబ్‌స్క్రిప్షన్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ సాంకేతికత GSMA ఆమోదించబడింది. ఇది పూర్తిగా సురక్షితం. eSIM స‌ర్వీస్‌ ప్రయోజనాలు BSNL eSIM 2G, 3G, 4G నెట్‌వర్క్‌లలో పనిచేస్తుంది. ఒకే సిమ్ స్లాట్, eSIM స్లాట్ ఉన్న మొబైల్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవ‌చ్చు. వినియోగదారులు ఇకపై రెండు సిమ్ కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది వారికి సౌ...
chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్
National

chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్

23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు Chhattisgarh Naxal News : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్ర‌వారం 103 మంది మావోయిస్టులు పోలీసుల‌కు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ అభ‌యార‌ణ్యం మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్ష‌న్ ప్లాన్‌, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచ‌న‌ల్లో గ‌ణ‌నీయ‌మైన‌ మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే భారీ స్థాయిలో న‌క్స‌లైట్లు లొంగిపోతున్నారు. లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్ప‌వ‌చ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంత...
error: Content is protected !!