Sarkar Live

Day: October 7, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త సంస్కరణలు – Jubilee Hills bye-election

Jubilee Hills bye-election | ముఖ్య ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ నిర్వహించ‌నున్న‌ట్టు రాష్ట్ర‌ ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి అన్నారు. తొలిసారిగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills bye-election)షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్య ఎన్నికల అధికారి సుద‌ర్శ‌న్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమ‌య్యారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌ల‌ను ఆయా పార్టీల నేత‌ల‌కు వివ‌రించారు. కొత్త సంస్క‌ర‌ణ‌లు ఇవీ.. ఒక్కో...
బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌
Hyderabad, State

బస్సు ఛార్జీల పెంపుపై BRS ఎమ్మెల్యేల వినూత్న నిర‌స‌న‌

Hyderabad | RTC ఛార్జీల పెంపును నిరసిస్తూ, BRS ఎమ్మెల్యేలు వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. ఎమ్మెల్యేలు డి. సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీకి సిటీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులపై ఆర్థిక భారం మోపే ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని, వెంట‌నే బ‌స్సు చార్జీల‌ను త‌గ్గించాల‌ని వారు డిమాండ్ చేశారు. బ‌స్సులో ప్ర‌యాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా ప‌లువురు ప్ర‌యాణికులు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ పెంపుదల రోజువారీ ప్రయాణికులపై నెలకు రూ. 400-500 అదనపు భారం ప‌డుతోంద‌ని అన్నారు. ప్రభుత్వం పేదలపై భారం మోపుతోందని, సేవలను మెరుగుపరచడంలో విఫలమైందని చాలా మంది ఆరోపించారు. అసెంబ్లీ సమీపంలో దిగిన తర్వాత, BRS శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్...
Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు
LifeStyle

Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు

Indian Railways Bharat Gaurav Train | విశాఖపట్నం: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌లను ప్రకటించింది. టూర్ టైమ్స్ నిర్వహిస్తున్న సౌత్ స్టార్ రైల్ ద్వారా భక్తులు భారత్‌లోని పవిత్రమైన ఆధ్యాత్మిక‌ ప్రదేశాలను దర్శించుకునే అరుదైన అవకాశం క‌ల్పిస్తోంది. మొదటి యాత్రా సర్క్యూట్ నవంబర్‌ 16న ప్రారంభమై 11 రోజులపాటు తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంది. ఇందులో ప్రదోషం రోజున నటరాజ స్వామి, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వర స్వామి దర్శనం ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు..టికెట్ ధరలు రూ. 19,950 (2SL) నుంచి రూ. 42,950 (1AC) వరకు ఉన్నాయి. రెండో యాత్ర నవంబర్‌ 26న ప్రారంభమవుతుంది. ఇది 10 రోజుల పాటు సాగి పంచ ద్వారక యాత్రను కవర్ చేస్తుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర...
error: Content is protected !!