Sarkar Live

Day: October 27, 2025

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌
State, AndhraPradesh

Cyclone Montha | ద‌డ పుట్టిస్తున్న‌ ‘మొంథా’ తుఫాను – ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్‌

Cyclone Montha News Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా (Cyclone Montha) మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న‌ట్లు భార‌త వాతావర‌ణ శాఖ వెల్ల‌డించింది. కాకినాడకు ఆగ్నేయంగా సుమారు 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రింది. , సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని IMD తెలిపింది. ఈ తుఫాను (Cyclone Montha ) ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 5 సెం.మీ. నుండి 20 సెం.మీ....
Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?
Special Stories

Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?

కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిన మిల్లు యాజమాన్యం? రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయం పై అనేక ఆరోపణలు పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసా? తెలియదా ? Hanamkonda | ఆ మిల్లు యాజమాన్యం కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిందా?ప్రభుత్వం సదరు మిల్లుకు పంపిన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు లేనట్లు?కేటాయించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం బహిరంగ మార్కెట్ కు తరలించిందా?లేక అసలు ఆ మిల్లుకు పూర్తిస్థాయిలో ధాన్యమే రాలేదా?అనే ప్రశ్నలు ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో చక్కర్లు కొడుతున్నాయి.హన్మకొండ జిల్లా (Hanamkonda District) గట్లకానిపర్తిలో ఉన్న వినాయక మిల్లుకు ప్రభుత్వం 2024-25 రబీ సీజన్ లో 3225.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం ఆ ధాన్యాన్ని మరాడించి 2160 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు నామమాత్రంగానే ...
error: Content is protected !!