Sarkar Live

Day: November 4, 2025

Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి
National, Crime

Train Accident | ప్యాసింజర్‌ రైలు గూడ్స్‌ రైలు ఢీ.. పలువురు మృతి

Bilaspur Train Accident | ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. రాయ్‌గఢ్‌ నుంచి వస్తున్న ప్యాసింజర్‌ రైలు లాల్‌ఖండ్‌ సమీపంలో నిలిచివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాల చర్యలు ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. బోగీలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గ్యాస్‌ కట్టర్ల సహాయంతో కోచులను కట్‌ చేస్తున్నారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని బిలాస్‌పూర్ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఈ రైలు ప్రమాదంలో మహిళా కో...
Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం
State, warangal

Warangal | ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోమారు వర్షం

Warangal : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి భారీ వ‌ర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ప‌లుచోట్ల‌ వరుసగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరంగల్‌ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంటపాటు పడిన వర్షానికి రహదారులపై వ‌ర‌ద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో అమ్మ‌కానికి తెచ్చిన‌ పత్తి, మొక్కజొన్న తడిసిపోవంతో రైతులు క‌న్నీరుమున్నీర‌య్యారు. ఇటీవల ‘మొంథా’ తుపాను ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు మరోసారి వర్షాల ముంపు భయంతో వణికిపోతున్నాయి. రేపు వ‌ర్షం కురిసే అవ‌కాశం తెలంగాణ వెదర్‌ మాన్‌ అంచనా ప్రకారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్...
Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!
Special Stories

Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!

ట్ర‌క్కులు, లారీల వ‌ల్ల‌ 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలు Telangana Road Accidents : ఇటీవ‌ల క‌ర్నూలులో బస్సు ద‌గ్ధ‌మై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న మ‌రువక ముందే చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ వ‌రుస‌ ప్రమాదాలు తెలంగాణ, ఏపీతోపాటు దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక కుటుంబాలను సర్వనాశనం చేసిన చేవెళ్ల‌ సంఘటన అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. చాలా వ‌ర‌కు ప్ర‌మాదాల్లో భారీ వాహనాల కార‌ణంగానే చోటుచేస‌కుంటున్నాయి ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలకు ట్రక్కులు, లారీలు కారణమయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జాతీయ డేటా చూపిస్తుంది. 2023లో మొత్తం మరణాలలో ట్రక్కులు, లారీల వల్ల జరిగిన ప్రమాదాలు 5.8 శాతంగా ఉన్నాయి. ఈ ప్రమాదాల బారిన పడిన వారిలో...
error: Content is protected !!