Sarkar Live

Day: April 9, 2026

రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!
Special Stories

రెవెన్యూ ‘రాజ్యాంగం’.. శేఖర్ కబంధ హస్తం!

​వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘బారాణా’ బ్రోకర్ హవా! ​అక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు.. కలెక్టర్ల ఆదేశాలు చెల్లవు.. కేవలం ఆ ‘బలవంతుడి’ మాటే వేదం. అతనే ‘రెవెన్యూ బ్రోకర్’ (Revenue Broker ) శేఖర్. ఒక సాదాసీదా వ్యక్తిగా మొదలై, నేడు రెండు జిల్లాల రెవెన్యూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్న వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​ దశాబ్ద కాలంగా ఏకఛత్రాధిపత్యం ​గత పదేళ్లుగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి మండల ఆఫీసుల వరకు శేఖర్ పేరు వినబడని చోటు లేదు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల.. ఇలా డివిజన్ ఏదైనా, పని కావాలంటే శేఖర్ కనుసన్నల్లోనే జరగాల్సిందే. సామాన్యుడికి దక్కని ఆర్డీవో, తహశీల్దార్ల దర్శనం ఈ బ్రోకర్ కు మాత్రం నిత్యకృత్యం. ​ అధికారులకు ‘పావలా’.. బ్రోకర్ కు ‘బారాణా’ ​అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, మ్యుటేషన్లు.. ఇలా ఫైలు ఏదై...
Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?
Special Stories

Rice Mill Scam | అదనపు కలెక్టర్ రంగంలోకి దిగేనా..?

జిల్లాలోని ఉప్పరపల్లిలో గల సాయిరాం రైస్ మిల్లులోని ధాన్యం నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం వచ్చిన ధాన్యం నిల్వలలో భారీ తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 32 ఏసీకేల (ACKs) ధాన్యంలో సగానికి పైగా మాయమైనట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై బుధవారం"సాయిరాం బిన్నీ రైస్ మిల్లులో సర్కారు ధాన్యం భద్రమేనా" అనే కథనాన్ని సర్కార్ లైవ్ ప్రచురించింది. అయితే ఈ మిల్లులోని ధాన్యం నిల్వల లెక్కలు తేల్చేందుకు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి రంగంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.. ​Rice Mill Scam : అసలేం జరుగుతోంది? ​గత కొంతకాలంగా ఈ మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, నివేదికల్లో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు సగానికి పైగా ధాన్యం నిల్వలు మిల్లులో భౌతికంగా లేవని, వాటిని పక్కదారి పట్టి...
తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections
State

తెలంగాణలో పరిషత్ ఎన్నికల హడావుడి.. సీఎం రేవంత్ కీలక సంకేతాలు – MPTC ZPTC elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ MPTC ZPTC elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ కదలికలు వేగం పెంచుకున్నాయి. మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికలను మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈ మేరకు పీసీసీకి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఎన్నికల టైమింగ్‌పై క్లారిటీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ఉండటంతో ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికలపై ముందడుగు వేయలేదు. అదనంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగియనున్న నేపథ్యంలో మే చివర్లో లేదా జూన్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించడం అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. MPTC ZPTC elections : క్యాడర్‌ను అలర్ట్ చేస్తున్న పీసీసీ ఈ ఎన్నిక...
వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!
State

వరంగల్ ప్రగతి రథ సారథి: కలెక్టర్ సత్య శారద మార్క్ పాలన!

పాలన అంటే కేవలం సంతకాలు, సమీక్షలు మాత్రమే కాదు.. ప్రజల గుండె చప్పుడిని వినడం అని నిరూపిస్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పై "సర్కార్ లైవ్" ప్రత్యేక కథనం.బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే జిల్లాలో తనదైన ముద్ర వేస్తూ, జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు. ​ప్రజల ముంగిటకే పాలన: 'ప్రజావాణి'కి కొత్త ఊపిరి ​సాధారణంగా కలెక్టరేట్ అంటే సామాన్యుడికి ఒక భయం ఉంటుంది. కానీ సత్య శారద గారు ఆ పరిస్థితిని మార్చేశారు. ప్రతి వారం నిర్వహించే 'ప్రజావాణి'లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల గోడును ఆమె స్వయంగా వింటున్నారు. ఫిర్యాదులను కేవలం స్వీకరించి పక్కన పెట్టకుండా, అక్కడికక్కడే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. ​ విద్యా, వైద్య రంగాల్లో క్షేత్రస్థాయి మార్పులు ​జిల్లాలో విద్య మరియు వైద్యం మెరుగుపడటమే లక్ష్యంగా ఆమె అకస్మిక ...
error: Content is protected !!