థాయిలాండ్ (Thailand) నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Mumbai Airport) చేరుకున్న ఒక భారతీయుడి వద్ద 48 అత్యంత విషపూరిత పాములు (Venomous Snakes), ఐదు తాబేళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. శనివారం రాత్రి బ్యాంకాక్ నుండి విమానం దిగిన తర్వాత కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారని ఆయన చెప్పారు. అతని వద్ద సామగ్రిని తనిఖీ చేస్తున్నప్పుడు, కస్టమ్స్ అధికారులు 48 అత్యంత విషపూరితమైన వైపర్ పాములు,యు ఐదు తాబేళ్లను కనుగొన్నారని ఆయన చెప్పారు.
RAW (రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్) బృందం ఈ జాతుల గుర్తింపు నిర్వహణలో సహాయపడిందని ఆయన చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం, సరీసృపాలను వాటిని తీసుకువచ్చిన దేశానికి తిరిగి పంపాలని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆదేశించిందని అధికారి తెలిపారు.







