మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్లడించింది. ఈమేరకు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్లో ప్రకటించింది.
ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.