ATM withdrawals ఏటీఎం వినియోగం ఇక భారం కానుంది. నగదు విత్డ్రా ఖరీదు (costlier)గా మారనుంది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు (ATM interchange fees) పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India (RBI)) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఇది మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇంటర్చేంజ్ ఫీజు అంటే..
ఏటీఎం లావాదేవీల (financial transactions)ను అధికంగా ఉపయోగించే ఖాతాదారుల (customers)పై ఈ మార్పు భారం కానుంది. ఉచిత పరిమితిని మించిన ప్రతి లావాదేవీపై అదనపు రుసుములు ఇక నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు (ATM interchange fees) అనేది ఒక బ్యాంకుకు మరో బ్యాంకు ఏటీఎంను ఉపయోగించిన ఖాతాదారుల లావాదేవీల కోసం చెల్లించాల్సిన చార్జీ. ఈ రుసుములు సాధారణంగా ఖాతాదారులకే భారంగా మారనున్నాయి.
ATM withdrawals : ప్రతి లావాదేవీపై అదనపు చార్జి
మే 1 నుంచి ఖాతాదారులు ఉచిత పరిమితిని మించిన ప్రతి నగదు ( (financial transactions)కి అదనంగా రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ఒక రూపాయి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈచార్జీలు దేశవ్యాప్తంగా అన్ని ఖాతాదారులపై ప్రభావం చూపించనున్నాయి. ముఖ్యంగా చిన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులపై ఎక్కువ భారం పడనుంది.
ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనా?
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014లో డిజిటల్ లావాదేవీల మొత్తం విలువ రూ. 952 లక్షల కోట్లు కాగా, 2023 నాటికి అది రూ. 3,658 లక్షల కోట్లకు పెరిగింది. ఈ రుసుముల పెంపు కారణంగా నగదు లావాదేవీలను అధికంగా చేసే వినియోగదారులు మిగతా డిజిటల్ చెల్లింపు పద్ధతుల వైపు మారే అవకాశం ఉంది. UPI, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు వంటి సేవలను ఉపయోగించడం ద్వారా ఖాతాదారులు ఏటీఎం ఫీజుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇటీవలే ప్రభుత్వ బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..