Sarkar Live

Author: Maulika

Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌
Crime, Khammmam

Khammam | సీపీఎం సీనియ‌ర్ నాయకుడి దారుణ హ‌త్య‌

Khammam news : ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత (CPM leader) సామినేని రామారావు (Samineni Ramarao ) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొంద‌రు సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. మ‌రో మూడు రోజుల్లో ఖ‌మ్మంలో రామారావు త‌న‌ మనవరాలి పెళ్లికి ఉండ‌గా ఇంత‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేక‌రించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కొన‌సాగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి కాగా, సామినేని రామారావు హత్య విష‌యం తెలుసుకుని డిప్యూటీ సీఎం...
Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..
State, warangal

Warangal | రేపు వ‌రంగ‌ల్‌లో సీఎం రేవంత్ ఏరియ‌ల్ స‌ర్వే..

వరంగల్‌ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Warangal : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో వ‌రంగ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది.. భారీ వరదల కార‌ణంగా అనేక కాల‌నీలు పూర్తిగా మునిగిపోయి ప్ర‌జ‌లకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు వ‌ర‌ద బాధితుల‌ను హుటాహుటిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇండ్ల‌లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకె...
KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష
State

KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష

కాంగ్రెస్‌ రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చింది: మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో అధికార‌ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌గా పేరుగాంచిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞత, తెలివితేటలకు ఈ ఎన్నిక కఠిన పరీక్షగా నిలుస్తుందని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని అన్నారు. “కాంగ్రెస్ దుష్టపాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంద...
Nizamabad | కానిస్టేబుల్‌ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌
Crime

Nizamabad | కానిస్టేబుల్‌ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంట‌ర్‌

Nizamabad | తెలంగాణలో సంచలనం సృష్టించిన‌కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ (Sheikh Riaz) మృతి చెందాడు. ఈ విష‌యాన్ని వైద్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పై క‌త్తితో దారుణంగా దాడిచేసి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు.ఈ దాడిలో కానిస్టేబుల్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఈ ఘటనపై పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్ప‌డి ముమ్మ‌రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ (Riyaz) ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతుండ‌గా రియాజ్‌‌ను పట్టుకునేందుకు ఓ యువ‌కుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడ...
హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య
Crime

హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య

Haryana IPS officer suicide case | హర్యానా పోలీసు అధికారి వై. పురాణ్ కుమార్ మృతి కేసులో ఊహించ‌ని మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి రోహ్‌తక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని సందీప్ కుమార్‌గా గుర్తించారు. ఆయన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆయన సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.లాధోట్ గ్రామంలోని అతని ఇంటి నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ తోపాటు ఒక వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో, వై. పురాణ్ కుమార్ ఒక "అవినీతి అధికారి" అని, అతనిపై "తగినంత ఆధారాలు" ఉన్నాయని ఆరోపించారు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. "నేను ఎప్పుడూ సత్యం పక్షాన ఉంటాను. స్వాతంత్ర్య పోరాటంలో నా కుటుంబం పాల్గొంది. భగత్ సింగ్‌ను నా ఆదర్శంగా భావ...
error: Content is protected !!