Sarkar Live

Author: Maulika

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు..  మరో 18 మందిపై న‌మోదు
State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై న‌మోదు

Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్ట‌ర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఓ త‌ప్పుడు కేసులో ఇరికిన త‌న‌ను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డ‌మే కాకుండా త‌న‌ను కులం పేరుతో దూషించి అవ‌మాన‌ప‌ర్చార‌ని ఓ వ్య‌క్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌లు తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంట‌ర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాన‌ని దుర్గ‌ప్ప అనే వ్య‌క్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికాన‌ని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొల‌గించార‌ని పేర్కొన్నారు. Infosys...
TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..
State

TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..

Survey on TG Employees | తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. అంకిత‌భావం, నిబద్ధ‌త క‌లిగిన వారు. త‌మ విధుల్లో ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛిస్తారు. ఈ మాట‌లు అంటున్న‌దెవ‌రో కాదు.. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యురాలి రూపొందించిన‌ నివేదిక‌లే చెబుతున్నాయి. ఇండియాలో వారానికి 70 గంటల పని చేయాలని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు అంత‌క‌న్నా ఎక్కువ స‌మ‌య‌మే వెచ్ఛిస్తూ విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని వెల్ల‌డైంది. TG Employees : రోజుకు ఎన్ని గంట‌లు ప‌ని చేస్తున్నారంటే.. తెలంగాణ రాష్ట్రం (Telangana) లోని ఉద్యోగులు రోజుకు సగటున 433 నిమిషాలు (7.21 గంటలు) పనిచేస్తున్నారు. ఇది దేశ సగటు 422 నిమిషాలు (7.03 గంటలు) కంటే ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగట...
Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…
Trending

Man eating Tiger | మనిషి రక్తం రుచి మరిగిన పులి.. చివ‌ర‌కు ఇలా…

Man eating Tiger | పెద్ద పులి దాడులతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ (wayanad) జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది. మనంతవాడి (Mananthavady) సమీపంలోని కాఫీ తోటల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మ‌హిళను పెద్దపులి దాడి చేసి చంపడం క‌ల‌క‌లం రేపింది. నరమాంసం తిన్న ఆ పెద్ద‌పులి ఆ త‌ర్వాత వరుస దాడులకు పాల్పడటం మ‌రింత భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పులిని కేర‌ళ ప్ర‌భుత్వం మ్యాన్ ఈట‌ర్ (Man eating Tiger)గా ప్ర‌క‌టించి, దానిని సుర‌క్షితంగా ప‌ట్టుకొనేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేపట్టింది. ముమ్మ‌ర గాలింపుల త‌ర్వాత‌.. పెద్ద పులి దాడుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు తీవ్ర ప్ర‌యత్నాలు చేశారు. పులిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమీప అడ‌వుల్లో గాలించారు. చివ‌ర‌కు ఆ పులి క‌ళేబ‌రాన్ని అట‌వీ ప్రాంతంలో గుర్తించారు. మ‌రో క్రూర మృగం చేతిలో… ...
Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌
State

Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra pradesh) అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme) అమలుకు సంబంధించి మార్గదర్శకాల (Guidelines )ను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ రోజు (సోమవారం) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను క‌చ్చితంగా అమ‌లు చేసి ఇల్లు లేని ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. Andariki Illu Scheme : నిలువ నీడ కల్పించేందుకు.. పేద కుటుంబాలకు గృహ సౌకర్యం అందించడ‌మే అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం ముఖ్యోద్దేశం. సొంత భూమి లేక నిలువ నీడ‌లేని వారికి గృహ వస‌తిని క‌ల్పించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల్లోకి తెచ్చింది. అర్హ‌త‌లు ఏముండాలంటే.. అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం (Andariki Illu Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు 3 సెంట్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల వార...
GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం
Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు అక్క‌డి వైద్యులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర (Maharashtra)లో గులియ‌న్-బారే సిండ్రోమ్‌తో మ‌ర‌ణించిన తొలి కేసుగా ఇది న‌మోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరిన వారి సంఖ్య ...
error: Content is protected !!