Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై నమోదు
Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్సీ డైరెక్టర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ తప్పుడు కేసులో ఇరికిన తనను ఐఐఎస్సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించి అవమానపర్చారని ఓ వ్యక్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఫిర్యాదుదారుడి ఆరోపణలు
తాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంటర్లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేశానని దుర్గప్ప అనే వ్యక్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికానని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్సీ నుంచి తొలగించారని పేర్కొన్నారు.
Infosys...




