Sarkar Live

Author: Maulika

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం
World

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం

ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్క‌డి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయ‌గా అదే న్యాయ‌స్థానం (United States’ Supreme Court )లో అత‌డు పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌ను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి ఈ అభ్య‌ర్థ‌న‌ను అమెరికా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది. Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీర‌ని విషాదం ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప‌క్కాప్ర‌ణాళిక‌తో ఈ ...
Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు
State

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు

Stop Violence Against Women : హైదరాబాద్‌(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళ‌న‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృత‌దేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మ‌హిళ‌పై జరిగిన దారుణం క‌ల‌కలం రేపుతోంది. దిశపై జ‌రిగిన దారుణంలా.. మునీరాబాద్ ఘటన 2019లో క‌ల‌క‌లం రేపిన‌ దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్‌లో జ‌రిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హ‌త్య ఎందుకు జ‌రిగింది? మునీరాబాద్‌ ప్రాంతంలో గల...
Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం
Crime

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం

మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇవాళ జ‌రిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో యంత్రాంగం ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన...
error: Content is protected !!