Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Post-metric Scholarships | స్కాల‌ర్‌షిప్‌ల్లో కొత్త విధానం.. ప‌క‌డ్బందీగా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌
Career

Post-metric Scholarships | స్కాల‌ర్‌షిప్‌ల్లో కొత్త విధానం.. ప‌క‌డ్బందీగా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌

Post-metric Scholarships : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ (Post-metric Scholarships) కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం దీన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్‌ (SC) విద్యార్థులకు ఇది వర్తించనుంది. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో వివరాలు స‌రిగా న‌మోదు కాక‌పోవ‌డంతో అనేక మంది విద్యార్థులు స్కాల‌ర్‌షిప్‌ను కోల్పోవాల్సి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి ప్ర‌భుత్వం (Telangana government) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండు ద‌ఫాలుగా అథెంటికేష‌న్‌ తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కొత్త దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియలో ప్రధానంగా రెండు ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదట‌ విద్యార్థులు ePass వెబ్‌సైట్‌లో త‌మ‌ ఆధార్‌కార్డు, SSC సర్టిఫికేట్...
Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?
State

Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?

Engineering Education : తెలంగాణ రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ విద్య‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంది. ముఖ్యంగా సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ విద్యా సంవత్సరానికి ( 2024-25) మేనేజ్‌మెంట్ కోటా కింద 6 వేల‌ సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. 10 కాలేజీల్లో భ‌ర్తీకాని అడ్మిష‌న్లు తెలంగాణలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) ఉన్నాయి. వీటిలో 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉంటాయి. ఇప్పటి వరకు 30 వేల‌ సీట్లు భర్తీ అయిన‌ప్ప‌టికీ ఇంకా 6 వేలు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఒక్క అడ్మిషన్ కూడా భ‌ర్తీ కాలేదు. ఈ కాలేజీలు అధికంగా B-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) అడ్మిషన్లపై ఆధారపడటం వల...
Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో సంచనాల దశగా గూగుల్..
Technology

Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో సంచనాల దశగా గూగుల్..

Google Ai : ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)పై గూగుల్ (Google) మ‌రింత దృష్టిని కేంద్రీక‌రించింది. జెమినీ 2.0, విలో లాంటి ప్రాజెక్టుల విజ‌యాల త‌ర్వాత మ‌రింత‌ ముంద‌డుగు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయి (Google CEO Sundar Pichai) త‌మ ల‌క్ష్యాల‌ను వెల్ల‌డించారు. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గూగుల్ దృష్టి కేంద్రీక‌రించింద‌ని ఆయ‌న తెలిపారు. 2024లో ఆర్టిఫిషియ‌ల్ రంగం సాధించిన విజ‌యాల నేప‌థ్యంలో గూగుల్ 2025లో మ‌రింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింద‌ని సుంద‌ర్ పిచాయి వివ‌రించారు. మ‌రింత కొత్త‌గా Google Ai గూగుల్ సాధించిన విజ‌యాలు అనేక ఉన్నా.. 2024లో త‌మ ఖాతాలో మ‌రిన్ని వ‌చ్చి చేరాయ‌ని సుంద‌ర్ పిచాయి తెలిపారు. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్, ఆండ్రాయిడ్, పిక్సెల్ వంటి విభాగాల్లో AI ద్వారా సాధించిన ప్రగతిని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఈ వ...
Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ
State

Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ

Sankranti Special Buses : సంక్రాంతి పండగ పూట తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి జేబుల‌ను గుల్ల చేస్తోంద‌ని ప్ర‌యాణికులు గ‌గ్గోలు పెడుతున్నారు. పండగ పూట స్వ‌గ్రామాల‌కు వెళ్లేందుకు నగరవాసులు పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచేసింద‌ని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఈరోజు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్రయాణికులు తీవ్ర‌ రద్దీతో కిట‌కిట‌లాడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం జనవరి 09 నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను న‌డిపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి త‌మ‌ను నిలువునా దోచేస్తోంద‌ని ప‌లువురు ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు ఈ మేరకు ప్రయాణికులు ధ‌ర‌లు పెంచిన టికెట్ల ను ఫొటోలు తీసి సోషల్ మీడియాల్లో షే...
Daku Maharaj New Trailer : నయా ట్రైలర్ అదిరిందయ్యా..!
Cinema

Daku Maharaj New Trailer : నయా ట్రైలర్ అదిరిందయ్యా..!

Daku Maharaj New Trailer : మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా నందమూరి నటసింహం బాలకృష్ణ నయా మూవీ డాకు మహారాజ్ నుండి మేకర్స్ రెండో ట్రైలర్ను రిలీజ్ చేశారు. బాలయ్య సినిమా అంటేనే మాస్ డైలాగ్స్.. ట్రైలర్లో అలాంటి డైలాగులు మచ్చుకు రెండు మూడు వదిలారు. 'నువ్వు చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశా.. మాస్టర్స్ ఎన్ మర్డర్స్', 'అలాగే నువ్వు అరిస్తే పార్కింగ్స్..నేను అరిస్తే ' అనే డైలాగ్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్లో తమన్ సింహం గర్జించిన సౌండ్ ఇవ్వడం ట్రైలర్ లో హైలెట్. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై కి చేరుకున్నాయి. కాగా కొత్త ట్రైలర్ ట్రైలర్ ( Daku Maharaj New Trailer ) మొదలవగానే బాలకృష్ణను ఉద్దేశిస్తూ విలన్ ఒక డైలాగ్ చెప్తాడు..అతని శరీరం మీద 16 కత్తిపోట్లు అన్నప్పుడు విలన్స్ చుట్టుముట్టి నరికేయడం , ఒక బుల్లెట్ గాయం అన్నప్పుడు విలన్స్ లో ఒకరు బాలకృష్ణ (Bala Krishn...
error: Content is protected !!