Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..
State

Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..

Bhu Bharati : భూముల రికార్డుల‌ను ప‌టిష్ట ప‌ర్చ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ స‌ర్కారు న‌డుం బిగించింది. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రీ‌కారం చుట్టింది. ధ‌ర‌ణి స్థానంలో ‘భూ భారతి’ని రూపొందించి. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త ఆర్వోఆర్ (రివెన్యూ రికార్డులు) బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌కటించారు. Bhu Bharati Bill కొత్త చట్టం లక్ష్యాలు భూభార‌తి అనే కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా పార్ట్-బీ కింద 18 లక్షల ఎకరాల భూముల సమస్యలకు పరిష్కారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ కంఠం భూములు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. చట్టంలోని తప్పుల పట్ల అప్పీల్‌కు కూడా అవ‌కాశం క‌ల్పించింది. ధరణిలోని 33 మాడ్యూల్స్‌తో పరిష్కరించలేని సమస్యలను భూ భారతిలో ఆరు మాడ్యూల్స్‌తో సులభతరం చేయ‌నుంది...
Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ
National

Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ

Parliament erupts | విపక్షాలు (INDIA), ఎన్డీఏ (NDA) ఎంపీల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. తోపులాట, పెనుగులాటల‌తో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. దీంతో ఆయ‌న్ను ఆ పార్టీ నేత‌లు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సారంగిని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసేసార‌ని, దీంతో ఆయన కింద‌పడిపోయి గాయ‌ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. ఆరోప‌ణలు.. ప్ర‌త్యారోప‌ణ‌లు అంబేడ్కర్ అంశంపై పార్ల‌మెంటు సాక్షిగా నిరసనలు జ‌రుగుతున్నాయి. అంబేద్క‌ర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించార‌ని విపక్షాలు ఆరోపిస్తూ పార్ల‌మెంట్ లోప‌ల‌, వెలుప‌ల నిర‌స‌న‌లు చేప‌డుతున్నాయి. ఇదే క్ర‌మంలోనే ఈ రోజు సేష‌న్ ప్రారంభానికి ముందుకు పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ప్ర‌తిప‌క్షాలు, బీజేపీ ఎంపీల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. తోపులాట‌లు, పెనుగులాట‌ల‌తో ఆ ప్రాంగ‌ణం హోరెత్తింది. తాను పార్లమెంట్ హౌస్‌లో ...
US California | కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. కారణమిదే..
Trending

US California | కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ.. కారణమిదే..

US California:  : కాలిఫోర్నియాలో అత్య‌వ‌స‌ర పరిస్థితులు ఎదుర‌వుతున్నాయి. బ‌ర్డ్‌ఫ్లూ అవియ‌న్ ఇన్‌ఫ్లూయెంజా A (H5N1) వైర‌స్‌ విజృంభించింది. దీని ప్ర‌భావంతో ఇప్ప‌టికే చాలా మంది అనారోగ్య పాలయ్యారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ గావిన్ న్యూసమ్ ఈ రోజు వెల్ల‌డించారు. దక్షిణ కాలిఫోర్నియాలో కేసుల గుర్తింపు severe bird flu : దక్షిణ కాలిఫోర్నియాలోని పాడి పశువుల ఫారాల్లో ఈ కేసులను గుర్తించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. దీంతో ఎమర్జెన్సీని ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు త‌గిన చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించామ‌ని వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్న‌డూ కాలిఫోర్నియాలో ఒక‌ వ్యక్తి నుంచి మ‌రొక‌రికి ఈ వైరస్ వ్యాపించ‌లేదని, అయితే.. ఈ వైర‌స్ బారిప‌డిన బాధితుల్లో ఎక్కువగా మంది పాడి పశువులత...
Ganja | హైద‌రాబాద్‌లో గంజాయి చాక్లెట్స్‌ కలకలం
Crime

Ganja | హైద‌రాబాద్‌లో గంజాయి చాక్లెట్స్‌ కలకలం

Ganja chocolates seized : గంజాయి స్మ‌గ్ల‌ర్లు కొత్త మార్గాల‌ను ఎంచుకున్నారు. నేరుగా స‌ర‌ఫ‌రా చేస్తే ప‌ట్టుబ‌డుతామ‌నే భ‌యంతో కొత్త ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకున్నారు. చాకెట్ల మాదిరి ప్యాకింగ్‌తో స‌ప్ల‌య్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఈ త‌ర‌హా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ షాపులో నిన్న రాత్రి దాడులు చేసిన సైబ‌రాబాద్ స్పెష‌న్ ఆప‌రేష‌న్ టీమ్ (SOT) పోలీసులు జ‌గ‌ద్గిగిరిగుట్ట‌లోని ఓ షాపులో వీటిని ప‌ట్టుకున్నారు. 2,400 చాక్లెట్లు స్వాధీనం సైబ‌రాబాద్ స్పెష‌న్ ఆప‌రేష‌న్ టీమ్ పోలీసులు 2,400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 13 కిలోలల బ‌రువు క‌లిగి ఉన్నాయి. అనంత‌రం బీహార్‌కు చెందిన సునీల్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడు బీహార్ నుంచి ఈ చాక్లెట్లను తెచ్చి హైదరాబాద్‌లోని స్థానిక కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారంలో ఇంకెవ‌రెవ‌రు ఉన్నారు.. ఎవ‌రి అండ‌దండ‌ల‌తో వీరు ఈ దందా చేస్తున్నా...
Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..
Cinema

Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..

Darshanam Mogilaiah : టాలీవుడ్ సినిమా బలగం ఫేమ్, ప్రముఖ జాన‌ప‌ద క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్య ఇక లేరు. దీర్ఘ‌కాలిక అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగిల‌య్య చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స చేయించుకొనేందుకు చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో మొగిల‌య్య‌కు ద‌ర్శ‌కుడు వేణు, ఆయ‌న టీమ్ అండ‌గా నిలిచింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. దీంతో వైద్యం చేయించుకుంటున్న మొగిల‌య్య నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అందిస్తున్న క్ర‌మంలోనే క‌న్నుమూసారు. Balagam Mogilaiah పాపులారిటీ.. మొగిలయ్య ‘కిన్నెర’ క‌ళాకారుడిగా గుర్తింపు పొందారు. అంతరించుకుపోతున్న ఈ క‌ళ‌ను కాపాడుకోవాల‌నే ఆయ‌న తాప‌త్రాయ‌ప‌డ్డారు. బ‌ల‌గం సినిమా(Balagma Movie ) తో ఆయ‌న బ‌హు ప్రా...
error: Content is protected !!