Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..
Bhu Bharati : భూముల రికార్డులను పటిష్ట పర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు నడుం బిగించింది. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది. ధరణి స్థానంలో ‘భూ భారతి’ని రూపొందించి. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆర్వోఆర్ (రివెన్యూ రికార్డులు) బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Bhu Bharati Bill కొత్త చట్టం లక్ష్యాలు
భూభారతి అనే కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా పార్ట్-బీ కింద 18 లక్షల ఎకరాల భూముల సమస్యలకు పరిష్కారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ కంఠం భూములు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. చట్టంలోని తప్పుల పట్ల అప్పీల్కు కూడా అవకాశం కల్పించింది. ధరణిలోని 33 మాడ్యూల్స్తో పరిష్కరించలేని సమస్యలను భూ భారతిలో ఆరు మాడ్యూల్స్తో సులభతరం చేయనుంది...




