Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
State

డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

Hyderabad : డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్  ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వీసీగా ఘంటా చక్రపాణి (Ghanta chakrapani )ని నియమిస్తూ  ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో  ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు. కాగా ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్.  ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపిసి ) పూర్తి చేశ...
Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర..  ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..
National

Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..

Farmers Protest Updates :  రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నగర సరిహద్దుల వద్ద ప్రభుత్వం బారీ భద్రతను పెంచింది. తమ డిమాండ్ల కోసం రైతులు నేటి మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుండి ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతుల నిరసనలు నేటికీ కొనసాగుతున్నాయి, అలాగే రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ప్రకారం, 101 మంది రైతులతో కూడిన 'జాతా' ఈ రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుంచి దేశ రాజధాని వైపు కదులుతుంది. . ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. 101 మంది రైతులతో 'మర్జీవ్దా జాతా' పేరుతో పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి ఢిల్లీకి మార్చ్‌గా బయలుదేరుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ ...
Outsourcing Jobs | అంగ‌ట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?
Special Stories

Outsourcing Jobs | అంగ‌ట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెడికల్ కాలేజీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముతున్న ఏజెన్సీ.. నోటిఫికేషన్ ఉండదు... నిబంధనలు పాటించరు..? ఉద్యోగాల పేరుతో దందా... రంగంలోకి దళారులు 76 పోస్టులను భర్తీ చేసే క్రమంలో కోటికి పైగానే చేతులు మారినట్లు ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ Warangal | సరుకులు కావాలంటే అంగట్లో దొరుకుతాయి. అదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కావాలంటే మాత్రం ఆ ఏజెన్సీ వద్ద మాత్రమే దొరుకుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి.. అప్పుడే కదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తుంది అని మీరు భావిస్తున్నారా? మరి వీరేంటి అంగట్లో సరుకులు దొరికినట్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ల‌భిస్తాయంటున్నారు? అని ఆశ్చర్యపో...
Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..
State

Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..

Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాల‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తుండ‌డంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌జాస్వామ్య పాల‌న కాదు.. రాక్ష‌స పాల‌న అని ఆయ‌న మండిప‌డ్డారు.ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని సీఎం రేవంత రెడ్డిని నిల‌దీశారు హ‌రీశ్‌రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తిరిగి కేసు బనాయించార‌ని, ఉదయాన్నే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్రమగా అరెస్టు చేసేందుకు య‌త్నించార‌ని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, త‌న‌పై, బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బె...
Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..
State

Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Telangana Assembly Sessions : తెలంగాణ శాస‌న స‌భ శీతాకాల సమావేశాలు డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి మొద‌లుకానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 9న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమ‌వుతాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. కాగా ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం త‌న‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాలపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు, కుల గ‌ణ‌న‌, మూసి ప్ర‌క్షాళ‌న‌, నూతన ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్ తోపాటుపలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు స‌మాచారం. కాగా సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు మంత్రులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే , దీనికి సంబంధించిన...
error: Content is protected !!