Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు
State, warangal

Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు

భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల గ్రేటర్ వరంగల్ (Warangal)లోని మామునూరు విమానాశ్రయం (Mamnoor Airport) నిర్మాణంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రాం​మోహన్​ నాయుడు ఈ మార్చిలో అనుమతిచ్చారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ప్రతిపాదనపై సంతకం కూడా చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ (Mamnoor Airport) నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రాం​మోహన్​ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో వరంగల్​ నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు వా...
ULLU, ALTT వంటి 25 OTT యాప్స్​పై  నిషేధం – జాబితా ఇదీ.
Technology

ULLU, ALTT వంటి 25 OTT యాప్స్​పై నిషేధం – జాబితా ఇదీ.

దేశంలోని ప్రసిద్ధ OTT యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తమ ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో అశ్లీల కంటెంట్ అందిస్తున్నాయన్న ఆరోపణలతో ALTT, ULLU, Desiflix, BigShots సహా 25 యాప్‌లను నిషేధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు ఐటీ చట్టం 2000 (సెక్షన్ 67, 67A), ఇండియన్ జస్టిస్ కోడ్ 2023 (సెక్షన్ 294), మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధ చట్టం 1986 (సెక్షన్ 4) తదితర చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలున్నాయి. స్టోరీబోర్డ్ 18 నివేదిక ప్రకారం, ఈ యాప్‌లు అశ్లీల వీడియోలు, బోల్డ్ ప్రకటనలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను బహిరంగంగా చాలా కాలంగా ప్రసారం చేస్తున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వీటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ముఖ్యంగా పిల్లలు ఈ కంటెంట్‌కి ఆకర్షితులవుతున్నారని, దీనివల్ల సమాజంపై ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని తెలిపింది. స...
LAWCET, PGECET 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇదే
career

LAWCET, PGECET 2025: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇదే

2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు న్యాయవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్ (PGECET), లాసెట్‌ (LAWCET) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ రెండు సెట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. లాసెట్ 2025కి సంబంధించి ఈనెల 26న శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 16, 17వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఉంటాయి. 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. ఇక పీజీఈసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి జూలై 26వ తేదీన టిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌ల...
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..
Technology

Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..

Indian Railway | దేశంలోని ప్ర‌ధాన‌మైన ఏడు రైల్వేస్టేష‌న్ల‌లో ఇండియ‌న్ రైల్వే (Indian Railway) అత్యాధునిక ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌తో సహా ఏడు ప్రధాన రైల్వే స్టేషన్‌లు ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేసియ‌ల్ రిక‌గ్నీష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడు రైల్వే స్టేషన్లు AI-ఆధారిత ముఖ గుర్తింపు నిఘా వ్యవస్థలను ప్రవేశపెడతాయి, ఇది సాంకేతికత సహాయంతో ప్రజల‌ భద్రతను ఆధునీకరించడానికి మెరుగుపరుస్తోంది. టికెట్ తనిఖీ, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు, ప్రయాణీకుల పొడవైన క్యూలు లేకుండా చేయ‌వ‌చ్చు. రైల్వే స్టేషన్లను స్మార్ట్ స్టేషన్లుగా మార్చే ప్రణాళిక కింద ఈ కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. దీనితోపాటు భద్రత, న...
error: Content is protected !!